పంజాబ్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలాను దారుణంగా కాల్చి చంపారు దుండగులు. మూసేవాలా జీపులు వెళ్తుండాగా అకస్మాత్తుగా రౌండప్ చేసిన దుండగులు ఆయనపై ఇరవై రౌండ్ల కాల్పులు జరిపి హతమార్చారు. ఈ దారుణమైన ఘటన మాన్సా జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో 424 మందికి పోలీస్ సెక్యూరిటీ రద్దు చేయగా అందులో మూసే వాలా కూడా ఒకరు ఉన్నారు.
విచిత్రం ఏంటంటే పంజామ్ లో వీరికి సెక్యూరిటీ విత్ డ్రా కొన్ని గంటల్లోనే పేరు మోసిన ఒక సింగర్, కాంగ్రెస్ నేత హత్య కావడం కలకలం సృష్టిస్తుంది. మూసేవాలా పంజాబ్ లో పాపులర్ సింగర్ గా మంచి పేరు సంపాదించాడు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి ప్రచారం చేశారు. అంతేకాదు మాన్సా నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేయగా ఆప్ అభ్యర్థి విజయ్ సింగ్లాపై 63 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
పంజామ్ లో ఇటీవల పోటీ చేసిన వారికి సెక్యూరిటీ విత్ డ్రా చేయడంతో ఆయనకు ప్రాణ హాని ఉందని పలుమార్లు పార్టీ నేతలు చెబుతున్నా.. సెక్యూరిటీ తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సిద్దూ మూసేవాలా పార్టీ కార్యక్రమాలు ముగించుకొని తన వాహనంలో బయలుదేరుతున్న సందర్భంలో దుండగులు హఠాత్తుగా ఎటాక్ చేశారు. సిద్దూని ఆసుపత్రికి తరలించగా అప్పటికే కన్నుమూశారని వైద్యులు తెలిపారు. పంజాబ్ లో తన పాటలతో అందరి హృదయాలు గెలుచుకున్నారు.
ఇటీవల పంజాబ్ లో జరిగిన ఎన్నికల సందర్భంగా మూసేవాలా ఒక పాట రాసి పాడారు. ఆ పాట రాష్ట్రంలో తెగ పాపులర్ అయ్యింది. ఇతర పార్టీ నేతలపై తనదైన మాటల భానాలు ఆ పాట ద్వారా విసిరారు. కొన్ని చోట్ల ఈ పాటపై తీవ్ర విమర్శలు కూడా వెల్లువెత్తాయి. సిద్దూ మృతిపై కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది. సిద్దూ మృతి దిగ్బ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా అన్నారు. అతని కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.
Punjab Congress leader & singer #SidhuMooseWala shot dead. @manjeet_sehgal tells us more. (@PoulomiMSaha) pic.twitter.com/zzNsWC9w4A
— IndiaToday (@IndiaToday) May 29, 2022