ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘తాజ్ మహాల్’ గురించి తెలియని వారు ఉండరు అని చెప్పాలి. ప్రేమకు చిహ్నంగా భావించే తాజ్ మహాల్ను చూడటానికి ప్రపంచ నలుమూల నుంచి నిత్యం వేల సంఖ్యలో జనం వస్తూ ఉంటారు. తాజ్ మహాల్ అందాలను చూసి మైమరచిపోతూ ఉంటారు. తాజ్ మహాల్కు దాదాపు 300 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రస్తుతం తాజ్ నిర్వహణ దేశ పురావస్తు శాఖ చూసుకుంటోంది. ఇక, పురావస్తు శాఖకు మతిపోయే సంఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది. తాజ్ మహాల్కు సంబంధించిన ఆస్తి, నీటి పన్ను బకాయిలు చెల్లించాలంటూ ఆగ్రా మున్సిపల్ కార్పోరేషన్ పురావస్తు శాఖకు నోటీసులు ఇచ్చింది.
దాదాపు 1.40 లక్షల ఆస్తి పన్ను, కోటి రూపాయల నీటి పన్ను కట్టాలని నోటీసులో పేర్కొంది. 15 రోజుల్లోగా బకాయిలు చెల్లించకపోతే తాజ్ను అటాచ్ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో ఏఎస్ఐ అధికారులు షాక్ అయ్యారు. ఏఎస్ఐ అధికారి ఒకరు దీని గురించి మీడియాతో మాట్లాడుతూ.. తాజ్ మహాల్ ఆస్తి పన్ను, నీటి పన్ను కట్టాలంటూ ఓ నోటీస్ వచ్చిందన్నారు. 1.40 లక్షల ఆస్తి పన్ను, కోటి రూపాయల నీటి పన్ను కట్టాలని ఈ నోటీసులు ఇచ్చారని తెలిపారు. తాజ్తో పాటు ఎత్మాద్ ఉద్ దౌలాకు కూడా నోటీసులు వచ్చాయని వెల్లడించారు. బ్రిటీష్ కాలం నుంచి ఎప్పుడూ నోటీసులు రాలేదని, ఇప్పుడిలా పంపడం ఆశ్చర్యంగా ఉందని వారు పేర్కొన్నారు.
ఆస్తి పన్ను మీద వడ్డీ కూడా వేశారని, దాదాపు రూ. 47 వేల వడ్డీ ఉందని అన్నారు. జాతీయ స్మారక చిహ్నాలకు ఆస్తి పన్ను వర్తించదని, వాణిజ్య అవసరాలకు వాడటం లేదు కాబట్టి నీటి పన్ను కూడా వర్తించదని స్పష్టం చేశారు. మున్సిపల్ అధికారులు పొరపాటున నోటీసులు పంపి ఉంటారని అన్నారు. అయితే, దీనిపై ఆగ్రా మున్సిపల్ కమిషనరల్ స్పందిస్తూ.. తాజ్కు నోటీసులు పంపిన సంగతి తనకు తెలియదని అన్నారు. మరి, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న తాజ్ మహాల్కు ఆస్తి, నీటి పన్ను నోటీసులు జారీ చేసిన ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Agra Municipal Corporation ने ASI को एक नोटिस जारी कर #TajMahal पर Water Tax के रूप में 1.9 करोड़ रुपये और Property Tax के रूप में 1.5 लाख रुपये का भुगतान करने के लिए कहा है। pic.twitter.com/A1XthKkcgR
— Neharika Sharma (@neharikasharmaa) December 20, 2022