ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్లో పోటీపడిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి తేనీటి విందు ఇచ్చారు. క్రీడాకారులను రాష్ట్రపతి భవన్కు ఆహ్వానించిన కోవింద్ క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఒలింపిక్ అథ్లెట్లను చూసి దేశం గర్వపడుతోందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. భారత ఒలింపిక్స్ చరిత్రలో ఈసారి అత్యధిక పతకాలు అందించారని వారిని ప్రశంసించారు.
మహిళా క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ‘విపత్కర పరిస్థితుల్లోనూ భారతావని సంబురాలు చేసుకునేలా చేశారు. ఎన్నో ఒడిదొడకులను ఎదుర్కొంటూ ప్రపంచస్థాయి ప్రదర్శన చేశారు. కొన్నిసార్లు గెలుస్తాం. కొన్నిసార్లు ఓడిపోతాం. కానీ ప్రతిసారీ కొత్త విషయాలు నేర్చుకొంటాం’ అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, క్రీడాశాఖ మాజీ మంత్రి కిరణ్ రిజుజుతోపాటు పలువులు మంత్రులు పాల్గొన్నారు.
భారత ఒలింపిక్స్ చరిత్రలోనే భారత్ ఈసారి అత్యధికంగా 7 పతకాలు సాధించింది. వందేళ్ల తర్వాత ట్రాక్ అండ్ ఫీల్డ్లో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. వెయిట్ లిఫ్టింగ్లో మీరాభాయి చాను, రెజ్లింగ్లో రవికుమార్ దహియా రజతం గెలుపొందారు. బ్యాడ్మింటన్లో పీవీ సింధు, బాక్సింగ్లో లవ్లీనా, రెజ్లర్ బజ్రంగ్ పునియా కాంస్య పతకాలు సాధించారు. భారత పురుషుల హాకీ జట్టు సైతం కాంస్యంతో మెరిసింది.
President Ram Nath Kovind hosted the Indian Contingent of the Tokyo Olympics 2020 over a ‘High Tea at Rashtrapati Bhavan Cultural Centre. The President interacted with the players and said that the entire country is proud of our Olympians for bringing glory to the nation. pic.twitter.com/3gbDOW9tFY
— President of India (@rashtrapatibhvn) August 14, 2021