ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లో అవినీతి రాజ్యం ఏలుతోంది. తాజాగా ముంబై వేదికగా జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ద్వారా ఈ రహస్యం ప్రపంచానికి తెలిసింది. అసలు విషయం ఏంటంటే.. ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న మన పెద్దలు.. భారత్ లో ఇతర క్రీడాకారులకు ‘ప్రోత్సాహం’ అందించడం కోసం కొంత మొత్తం వెచ్చిస్తుంటారు. ఎప్పటిలాగే.. గతేడాది టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన విజేతల కోసం కొంత మొత్తాన్ని నజరానాగా ప్రకటించారు. ఆ లెక్కల్లో తప్పులు దొర్లాయి.
గతేడాది జపాన్ వేదికగా జరిగిన టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన నీరజ్ చోప్రాతో పాటు లవ్లీనా బోర్గోహెయిన్, పివి సింధు వంటి ఆటగాళ్లకు బీసీసీఐ ప్రైజ్ మనీ ప్రకటించింది. ఆ ప్రైజ్ మనీ మొత్తం అక్షరాలా.. రూ. 4 కోట్లు. కానీ బీసీసీఐ మాత్రం దీనిని రూ. 18 కోట్లుగా చూపించింది.
ముంబైలో ఇటీవలే జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చినట్టు ఇన్సైడ్ స్పోర్ట్ వెబ్సైట్ కథనాన్నిప్రచురించింది. ఆటగాళ్లకు అందిన ప్రోత్సాహం కంటే బీసీసీఐ చేసిన ఆర్బాటాలే ఎక్కువున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. ఆర్బాటాలలో భాగంగా ఆటగాళ్లలో స్ఫూర్తి నింపేందుకు గాను ప్రముఖ గాయకుడు మోహిత్ చౌహాన్ కు రూ. 70 లక్షలను ఖర్చు చేసిన బోర్డు.. ఒలింపిక్స్ మార్కెటింగ్ క్యాంప్ నకు రూ. 90 లక్షలు వెచ్చించిందట. ఇవేగాక.. టోక్యో ఒలింపిక్స్ ప్రమోషన్స్ కోసం ఓ కమర్షియల్ కంపెనీకి రూ. 7 కోట్లు కట్టబెట్టిన బీసీసీఐ.. పీఎం కేర్స్ మెమొంటోల కోసం రూ. 5 కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కల్లో చుపిందన్నది సమాచారం.
వాస్తవానికి బీసీసీఐ.. భారత ఒలింపిక్ సంఘానికి (ఐవోఏ) రూ. 10 కోట్ల ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చింది. కానీ పతక విజేతలకు ఇచ్చింది రూ. 4 కోట్లు మాత్రమే. మరి ఈ లెక్కల్లో బొక్కల గురించి బీసీసీఐ బాసులు, ట్రెజరీలే సమాధానం చెప్పాలంటున్నారు క్రీడాభిమానులు. ఈ లెక్కల చూసి.. యావత్ భారత అభిమానులు నవ్వుకుంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
BCCI announces the prize money for India’s medal winners at Tokyo Olympics 2020.#Tokyo2020 #Olympics #TeamIndia #BCCI #CricCLiQ pic.twitter.com/VGXbWOWf9R
— The Crictop (@thecrictophindi) August 8, 2021
ఇది కూడా చదవండి: Dinesh Karthik vs Murali Vijay: దినేశ్ కార్తీక్ మొదటి భార్య, మురళీ విజయ్ సతీమణిగా ఎలా అయ్యింది..?
ఇది కూడా చదవండి: Team Inida: శ్రీలంక సృష్టించిన రికార్డును సమం చేసిన టీమిండియా!