ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్లో పోటీపడిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి తేనీటి విందు ఇచ్చారు. క్రీడాకారులను రాష్ట్రపతి భవన్కు ఆహ్వానించిన కోవింద్ క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఒలింపిక్ అథ్లెట్లను చూసి దేశం గర్వపడుతోందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. భారత ఒలింపిక్స్ చరిత్రలో ఈసారి అత్యధిక పతకాలు అందించారని వారిని ప్రశంసించారు. మహిళా క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ‘విపత్కర పరిస్థితుల్లోనూ భారతావని సంబురాలు చేసుకునేలా చేశారు. ఎన్నో ఒడిదొడకులను ఎదుర్కొంటూ ప్రపంచస్థాయి […]