త్వరలో జరగనున్న ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్తో పాటు మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమలు పోటీ పడుతున్నారు. ప్రకాశ్ రాజ్ అందరి కంటే ముందున్నారు. అప్పుడే తన కార్యచరణను ప్రకటించిన ఆయన ఏకంగా 27 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ను అనౌన్స్ చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల అంశం ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. అధ్యక్ష పదవి కోసం పోటీ చేసేందుకు సిద్ధమైన ప్రకాశ్రాజ్పై పలువురు ఇండస్ట్రీ సభ్యులు విమర్శల వర్షం ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దీనిపై వరుస ట్వీట్లు చేశారు.
కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రకాశ్రాజ్ నాన్లోకల్ అయితే, గుడివాడ నుంచి చెన్నైకి వెళ్లిన రామారావు, నాగేశ్వరరావు, బుర్రిపాలెం నుంచి మద్రాస్ వెళ్లిన కృష్ణ, తిరుపతి నుంచి మద్రాస్ బయల్దేరిన మోహన్బాబు లోకలా? మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడికో వెళ్లిన రజనీకాంత్, ఉత్తర్ప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి వెళ్లిన అమితాబ్ బచ్చన్ లోకలా? ముప్పై ఏళ్లుగా ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని, చలం పుస్తకాలని ముద్రించి, భార్యాపిల్లలతో ఇక్కడే ఉంటూ, తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడున్న ఎంతోమంది మహిళలకు పని కల్పిస్తున్న ఆయన నాన్ లోకలా? అంటూ ట్వీట్ల వర్షం కురిపించారు.
ప్రకాశ్రాజ్లోని ప్రతిభ గుర్తించిన ఈ దేశం నాలుగుసార్లు ఆయన్ని శాలువా కప్పి జాతీయ అవార్డుతో సత్కరిస్తే.. ఇప్పుడు అదే వ్యక్తిని నాన్లోకల్ అంటున్నాం’ అని ఆర్జీవీ ట్వీట్లు చేశారు. ఇలా వరుస ట్వీట్లతో ప్రకాశ్ రాజ్ను తన మద్దతును తెలియజేశాడీ సంచలన దర్శకుడు వర్మ.
కర్ణాటక నించి ఆంధ్రప్రదేశ్ వచ్చిన @prakashraaj నాన్ లోకల్ అయితే, గుడివాడ నించి చెన్నైకి వెళ్లిన రామారావుగారు, నాగేశ్వరరావుగారు …బుర్రిపాలెం నించి మద్రాస్ వెళ్లిన కృష్ణగారు,తిరుపతి నించి మద్రాస్ బయల్దేరిన మోహనబాబు గారు లోకలా ??? ఎలా ఎలా ఎలా ? #MaaElections
— Ram Gopal Varma (@RGVzoomin) June 25, 2021
కర్ణాటక నించి AP కి వచ్చిన @prakashraaj నాన్ లోకల్ అయితే, మహారాష్ట్ర నుండి ఎక్కడెక్కడికో వెళ్ళిన రజనీకాంత్ గారు, ఉత్తర ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర కి వెళ్ళిపోయిన అమితాబ్ బచ్చన్ గారు లోకలా ??? ఎలా ? ఎలా ? ఎలా ? #MaaElections
— Ram Gopal Varma (@RGVzoomin) June 25, 2021