ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు.. ఏ వంటలు వండినా మొదట ఉల్లిని కట్ చేయాల్సిందే. ఉల్లి లేని కూర అసలు ఊహించలేం. అలాంటి ఉల్లి ధరలు దేశంలో కొన్నిసార్లు చుక్కలనంటితే... కొన్నిసార్లు దారుణంగా పడిపోతుంటాయి. రైతులను ఒక్కసారే కష్టాల్లోకి నెడుతాయి.
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెత ఉంది. మనం ఏ కూర వండాలన్నా ముందుగా ఉల్లిపాయలు కోస్తాం.. ఉల్లి లేని కూర ఊహించుకోవడమే కష్టం అంటారు. ఉల్లిపాయ ఎన్నో రకాల వంటల్లో వాడుతుంటారు. కొంతమంది పచ్చి ఉల్లి తినడానికి ఇష్టపడుతుంటారు. ఉల్లిపాయ వంటల్లో రుచి మాత్రమే కాదు.. మనిషికి ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. మార్కెట్ లో ఉల్లిపాయ ధరలు కొన్నిసార్లు అమాంతం పెరిగిపోతే.. కొన్నిసార్లు దారుణంగా ధరలు తగ్గిపోతాయి. ఓ దేశంలో ఉల్లి ధర రికార్డు స్థాయిలో పెరిగిపోయింది.. ఒకదశలో ఉల్లి కన్నా మాంసం రేట్లు నయం అన్న పరిస్థితి నెలకొంది. ఇంతకీ అది ఏ దేశం అంటారా? పూర్తి వివరాల్లోకి వెళితే..
మన దేశంలో రోజు రోజుకీ ఉల్లి ధర దారుణంగా పడిపోతుంది.. మహారాష్ట్రలో అయితే ఇప్పుడు ఉల్లి ధర కేవలం రూ.2 మాత్రమే. కానీ ఫిలిప్పీన్స్లో ఉల్లి ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముకునే పరిస్థితి నెలకొంది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని కొంత కాలంగా ఉల్లి సంక్షోభం నెలకొంది. దీంతో అక్కడ ప్రస్తుతం ఉల్లి ధర కిలో ఏకంగా రూ.1200 కు చేరుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ చికెన్, మటన్ కన్నా ఉల్లి ధర భారీ ఎత్తున పెరిగిపోయిందని అంటున్నారు. పెరిగిన ఉల్లి ధర తట్టుకోలేక హూటల్స్, రెస్టారెంట్స్ లో ఉల్లి రెసిపీ కనిపించకుండా పోయిందని చెబుతున్నారు. ఇటీవల పిలిప్పిన్స్ లో ద్రవ్యోల్భణం 14 ఏళ్ల గరిష్టానికి చేరుకుందని అంటున్నారు. ఈ కారణంగానే ఉల్లి ధరలు అమాంతం పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోవడంతో కొంతమంది రైతులు దీన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉల్లి పంట పూర్తిగా ఎదగక ముందే వాటిని తవ్వి మార్కెట్ లో విక్రయానికి తీసుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిలిప్పిన్స్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.. విదేశాల నుంచి 21 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉల్లిని భారీ స్థాయిలో నిల్వ చేస్తున్న కొంతమంది అక్రమ వ్యాపారుల గోడౌన్లపై ఆకస్మిక దాడులు చేస్తున్నారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇక్కడ ఉల్లి ధర మాత్రం దిగిరావడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇక ఉల్లి ధర ఎంత డిమాండ్ ఉందంటే.. స్మగ్లర్లు సైతం ఉల్లి బస్తాలను స్మగ్లింగ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. పెళ్లిళ్లో ఉల్లిపాయలను గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఈ మద్యనే ఓ విమానంలో ఉల్లి బస్తాలను మనీలా విమాన సిబ్బంది స్వాధీనం చేసుకుంది.