ఇప్పుడు చాలా మంది కొత్త కార్లు తీసుకుంటున్నారు. కొత్త కారు కొంటే కచ్చితంగా చాలా కంపెనీలు ఎయిర్ బాగ్స్ ఇస్తున్నాయి. అయితే ఇప్పటికే కార్లు కొన్న వారు, అందులో ఎయిర్ బ్యాగ్స్ లేకపోతే కచ్చితంగా వాటికి కూడా ఎయిర్ బ్యాగ్స్ పెట్టుకోవాల్సిందే. ఇప్పటి వరకు డ్రైవర్ సీటుకు మాత్రమే ఏర్పాటు ఉన్న ఎయిర్ బ్యాగ్, డ్రైవర్ పక్కనే ఉన్న మరో సీటుకు కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని రహదారి రవాణా శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక కొత్తగా తయారు అవుతున్న అన్నీ మోడల్స్ కార్లకి కూడా ఇది అమలు చేస్తారు.
2021 ఏప్రిల్ 01 తర్వాత తయారు చేసిన వాహనాలు కొత్త మోడళ్లు విషయంలో ఫ్రంట్ సీట్ ఎయిర్ బ్యాగ్ అమర్చాల్సి ఉంటుంది. ప్రయాణీకుల భద్రత విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాహనాల్లో డ్రైవర్ సీటులో ఎయిర్ బ్యాగ్ను కేంద్రం ఇప్పటికే తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. డ్రైవర్ పక్కన కూర్చునే వారికి కూడా ప్రమాదం పొంచి ఉండడంతో ఆ సీటులోనూ ఎయిర్ బ్యాగ్ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.
కాలం చెళ్లిపోయి రోడ్ల మీద సంచరించే వాహనాల్లో కూడా ఎయిర్ బ్యాగ్ తప్పనసరి కానుంది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల దృష్ట్యా కార్ల మోడళ్లలో ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ తప్పనిసరి చేయడాన్ని 2021, డిసెంబర్ 31 వరకు వాయిదా వేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని సమాచారం.