ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారి వ్యాప్తి పూర్తి పోయినట్లు లేదు. ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలోను దీని వ్యాప్తి ఇంకా కొనసాగుతునే ఉంది. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ పంజా విసురుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్ర దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో బుధవారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీలో కరోనా నిర్ధాణ అవ్వడంతో కలకలం రేపుతోంది.
ఇదీ చదవండి : ఒమిక్రాన్ భయం.. తెలంగాణలోని ఆ గ్రామంలో లాక్డౌన్!
మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు కోవిడ్ పరీక్షలు చేపట్టారు. ఈ క్రమంలో సమావేశాలకు ముందు దాదాపు 3,500 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పది మందికి పాజిటివ్ గా తేలింది. కరోనా సోకిన వారిలో ఎనిమిది మంది పోలీసులతో పాటు ఇద్దరు అసెంబ్లీ సిబ్బంది ఉన్నారు. అయితే ఎమ్మెల్యేల్లో ఎవరు గానీ కోవిడ్ బారిన పడలేదు. అయితే పది కరోనా కేసులు వెలుగుచూడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు మరింత పటిష్టంగా కరోనా పరీక్షలు నిర్వహించి అసెంబ్లీ సమావేశాలుకు ఏర్పాట్లు చేయనున్నారు.