దేన్నైన అమితంగా తీసుకోవడం వలన లేని పోని సమస్యలు ఉత్పన్నం అవడం సహజం. రుచి బాగుంది కదా అని ఏది పడితే అది లాగించేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది. మధ్యప్రదేశ్ శిప్పూరి జిల్లా ఖోడ్ గ్రామానికి చెందిన 12 ఏళ్ల సందీప్ కంటి చూపు క్రమంగా మందగించడం ప్రారంభం అయ్యింది. ఓ రోజు పూర్తిగా చూపు కోల్పోయాడు. అప్పటి వరకు ఈ సమస్యను పెద్దగా పట్టించుకోని అతడి తండ్రి పూర్తిగా చూపు కోల్పోయిన తర్వాత ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సందీప్ను పరీక్షించిన వైద్యులు అతడి రిపోర్టులు చూసి షాక్ తిన్నారు.
వైద్యులను అంతలా ఆశ్చర్యపరిచిన అంశం ఏంటంటే సందీప్ బ్లడ్ షుగర్ లెవల్స్ ఏకంగా 1206 మిల్లీగ్రాములుగా ఉన్నట్లు గమనించారు. ఇంత చిన్న కుర్రాడికి ఇంత పెద్ద మొత్తంలో షుగర్ లెవల్స్ ఉండటం ఏంటని ఆశ్చర్యపోయి అతడి ఆహారం గురించి ఆరా తీశారు. సందీప్ రోజుకు 40 చపాతీలు తినేవాడని అతడి తండ్రి తెలిపాడు. సందీప్ కు షుగర్ లెవల్స్ 1200 కంటే ఎక్కువగా పెరిగిపోయాయని అందువల్లే ఇలా జరిగిందని డాక్టర్లు తెలిపారు. వైద్యులు సందీప్ తలకు సర్జరీ చేసి 720 మిల్లీ లీటర్ల చీము తొలగించారు. చక్కెర స్థాయిలను తగ్గించడం కోసం ప్రతి రోజు సందీప్కు 6 యూనిట్ల ఇన్సులిన్ను ఇవ్వడం ప్రారంభించారు. షుగర్ లెవల్స్ సాధారణ స్థితికి వచ్చాక కంటి వైద్యుడు సందీప్ను పరీక్షించి ఆ బాలుడు డయాబెటిక్ రెటినోపతితో బాధపడుతున్నాడని వైద్యులు గుర్తించారు. మిగతా అవయవాలు కూడా పని చేయడం మానేశాయి.