పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ ఇంటి వద్ద లైవ్ బాంబు దొరకడం కలకలం రేపింది. చండీగఢ్ లోని ఆయన నివాసం వద్ద పోలీసులు ఈ బాంబును స్వాధీనం చేసుకున్నారు. మాన్ నివాసానికి దగ్గరలోనే ఉన్న హెలిపాడ్ సమీప ప్రాంతంలో ట్యూబ్ వెల్ ఆపరేటర్ ఒకరు దీన్ని గుర్తించారు. వెంటనే బాంబ్ నిర్వీర్య బృందాలతో పాటు డిజాస్టర్ మేనేజిమెంట్ సిబ్బంది అక్కడకి చేరుకొని ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. బాంబు షెల్ లైవ్లో ఉండటంతో దానిని జాగ్రత్తగా ఫ్రైబర్ డ్రముల్లో ఉంచి, చుట్టుపక్కల ఇసుక బస్తాలను సిద్ధం చేసి.. పేలకుండా నిర్వీర్యం చేశారు.
ఎవరో భగవంత్ మాన్ సింగ్ హత్యకు కుట్ర పన్నే బాంబు అమర్చి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. బాంబు ఎక్కడి నుంచి వచ్చింది..? ఎలా వచ్చింది..? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. “ఇక్కడ అవాంఛనీయ పదార్థం ఉన్నట్టు మాకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకొని పరిశీలించగా.. లైవ్ బాంబ్ షెల్ గా గుర్తించాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దాన్ని నిర్వీర్యం చేశాం..” అని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుతం బాంబు స్క్వాడ్తో ఆ ప్రాంతాన్నంతా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అయితే బాంబును గుర్తించిన సమయంలో ఆయన ఇంట్లో లేరు. ఈ ఘటన జరిగాక సీఎం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.. పోలీసులు.
#BREAKING | Live Bomb found 500 meters away from Punjab CM Bhagwant Mann’s helipad in Chandigarh. Tune in here, Republic brings you updates #LIVE from the spot – https://t.co/HbKDYgaNDs pic.twitter.com/27yrcyrh0J
— Republic (@republic) January 2, 2023