ఈమధ్య కాలంలో అక్రమ సంబంధాలు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాలకు కుటుంబాలే చిన్నాభిన్నం అవుతున్నాయి. తాజాగా ప్రియుడితో మూడుసార్లు లేచిపోయిన భార్య.. తన భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది.
ప్రస్తుత కాలంలో ఏ న్యూస్ ఛానల్ చూసినా గానీ భర్తను చంపిన భార్య అనో.. భార్యను అతికిరాతకంగా చంపిన భర్త అనో.. వార్తలను మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ హత్యల వెనక కారణాలు చూస్తే మనం విస్తుపోతాం. పచ్చని కాపురాల్లో తెలిసి తెలిసి నిప్పులు పోసుకుంటున్నారు కొందరు దంపతులు. ఈ మధ్య కాలంలో ఇలాంటి హత్యల వెనక ఉన్న ప్రధాన కారణం ఏంటా అని ఆరా తీస్తే.. అది వివాహేతర సంబంధం అని బయటపడుతుంది. ఈ క్రమంలోనే తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని బరితెగించిన భార్య.. చేసిన పనికి పోలీసులే షాక్ అవుతున్నారు. అయితే ఇక్కడ మరో ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే? అప్పటికే ఆమె తన ప్రియుడితో మూడు సార్లు వెళ్లిపోయి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా రామనత్తంలోని తాచూర్ గ్రామానికి చెందిన బాలకృష్ణన్-రాధిక దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు. ఇక బాలకృష్ణన్ ఆ ప్రాంతంలోనే దొరికిన పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన దినేష్(23) అనే యువకుడితో రాధికకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. రెండు సంవత్సరాలుగా వీరి మధ్య అక్రమ సంబంధం సజావుగానే సాగింది. అదీకాక ఈ రెండేళ్లలో రాధిక-దినేష్ లు మూడుసార్లు లేచిపోయారు. దాంతో బాలకృష్ణన్ పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో.. రాధికకు కౌన్సిలింగ్ ఇచ్చి బాలకృష్ణ వద్దకు చేర్చారు.
ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని సంఘటన బుధవారం చోటుచేసుకుంది. బాలకృష్ణ తన ఇంటి బుధవారం ఉదయం శవమై కనిపించాడు. బాలకృష్ణన్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు డైరెక్ట్ గా రాధికను తమ స్టైల్లో విచారించగా.. నేరం అంగీకరించింది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతోనే బాలకృష్ణన్ ను హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకుంది. దాంతో రాధికను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక బాలకృష్ణ మరణం, రాధిక అరెస్ట్ తో ఇద్దరు కుమారులు ఏకాకులుగా మారారు. మరి ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తనే హత్య చేసిన ఈ మహిళపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.