ఓ యువకుడు సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. కళ్ల ముందు కాలిపోతున్న లారీ దగ్గరకు వెళ్లాలంటేనే మనం వెనకడుగు వేస్తాం. కానీ, అతడు ఏ మాత్రం భయపడలేదు.. ధైర్యంగా ముందుకెళ్లాడు. చుట్టూ ఉన్న పరిస్థితిని గమనించి దాన్ని ఏ విధంగా అదుపులోకి తీసుకురావచ్చో ఆలోచించాడు. సమయస్ఫూరితో మంటలంటుకున్న లారీని నడిపి.. ఓ సురక్షిత ప్రదేశంలో పార్క్ చేశాడు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వివరాల్లోకి వెళ్లితే.. కేరళలోని కౌడెన్చెరీ ప్రాంతం. అక్కడే వరి గడ్డితో ఫుల్ లోడ్ నిండి ఉన్న లారీకి ఓవర్ హెడ్ పవర్ లైన్ (విద్యుత్ తీగలు) తాకి.. లారీకి వేగంగా మంటలు వ్యాపించాయి. లోపల ఉన్న డ్రైవర్ నిస్సహాయ స్థితిలో ఉండటం గమనించిన షాజీ వర్గీస్ అనే యువకుడు, ఏ మాత్రం భయపడకుండా లారీలోకి ప్రవేశించాడు. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన వర్గీస్ వెంటనే జనసంచారం లేని ఓ ఖాళీ ప్లే గ్రౌండ్లోకి లారీని నడిపి.. అక్కడ పార్క్ చేశాడు.
ఇక్కడ నేరుగా కాకుండా జిగిజాగ్ పద్ధతిలో లారీని నడిపితే సురక్షితంగా ఉంటుందని భావించిన షాజీ వర్గిస్.. అదే పద్ధతిని అనుసరించాడు. ఫైర్ సిబ్బంది రావడానికంటే ముందే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు వర్గీస్ తో పాటు ఇతరులు కూడా నిర్విరామంగా శ్రమించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వర్గీస్ తెగువను మెచ్చి ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.