Siddique Kappan: ఆగస్టు 15.. దేశ స్వాతంత్ర వేడుకల సందర్భంగా కేరళకు చెందిన ఓ చిన్నారి తన తండ్రిపై ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. జర్నలిస్టు అయిన తన తండ్రి అరెస్టయి ఉత్తర ప్రదేశ్ జైల్లో ఉన్నాడని ఆ పాప ఆవేదన చెందింది. తండ్రిని చూడాలంటూ కంటతడి పెట్టుకుంది. అంతేకాదు! ‘‘స్వాతంత్రం, సామాన్యుల హక్కుల’’పై చక్కటి ఉపన్యాసం ఇచ్చింది. చిన్నారి ప్రసంగం వీడియో దేశ వ్యాప్తంగా వైరల్గా మారింది. అందరూ ఆ పాపపై ప్రశంసలు కురిపించారు. ఆమె తండ్రి విడుదలైతే బాగుండును అనుకున్నారు.
ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు సదరు పాప తండ్రి సిద్ధిఖీ కప్పన్ బెయిల్ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపింది. సిద్ధిఖీకి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. ‘‘ప్రతీ ఒక్కరికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది’’ అని పేర్కొంది. అతడు ఓ ఆరు నెలల పాటు ఢిల్లీ పోలీసులకు రిపోర్టు చేయాల్సి ఉంటుందని, తర్వాత కేరళ పోలీసులకు రిపోర్టు చేయాలని తెలిపింది. దీంతో మరికొన్ని రోజుల్లో సిద్ధిఖీ జైలు నుంచి విడుదల కానున్నారు. తన కూతుర్ని చేరుకోనున్నారు. తండ్రికోసం రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న చిన్నారి ఆశలు ఫలించినట్లయ్యాయి.
సిద్ధిఖీ అరెస్ట్కు కారణం ఏంటి?..
ఉత్తర ప్రదేశ్లో హత్రస్ గ్యాంగ్ రేప్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2020లో 19 ఏళ్ల యువతిపై కొంతమంది సామూహిక అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించిన న్యూస్ను కవర్ చేయటానికి సిద్ధిఖీ ఉత్తర ప్రదేశ్ వెళ్లాడు. ఈ నేపథ్యంలో హత్రస్లో శాంతి భద్రతలు దెబ్బ తీయటానికి ప్రయత్నం చేస్తున్నాడన్న ఆరోపణలతో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గత రెండు సంవత్సరాలనుంచి సిద్ధిఖీ యూపీ జైలులో ఉంటున్నాడు. మరి, చిన్నారి ఎదురుచూపులు ఫలించి పాప తండ్రికి బెయిల్ మంజూరు కావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అమ్మ ప్రేమ: కొడుకు మృతితో ఆగిన తల్లి గుండె..