బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్
బాధితుడు స్పృహలోనే
గాయత్రీ మంత్ర జపం
సర్జరీ నాలుగు గంటలు
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రిథం లాల్ రామ్ కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నారు. సర్జరీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. బాధితుడు స్పృహలో ఉంటూనే ఈ ఆపరేషన్ చేయించుకోవడం విశేషం. ఆపరేషన్ చేస్తున్నందసేపూ బాధితుడు గాయత్రీ మంత్ర జపం చేస్తున్నారని తెలిపారు.
ఉద్యోగి లాల్ రామ్ బ్రెయిన్ లోని కీలకమైన ప్రాంతంలో ట్యూమర్ ఏర్పడింది. దీంతో బాధితునికి ఆపరేషన్ చేసే సమయంలో చిన్నపాటి పొరపాటు జరిగినా అతను మాట కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు గుర్తించారు. ఫలితంగా వైద్యులు బాధితుడిని స్పృహలో ఉంచుతూనే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.
ఈ సమయంలో వైద్యులు బాధితునితో తరచూ చేతివేళ్లను, పాదాలను కొద్దిగా కదిలిస్తూ ఉండాలని చెప్పారు. ఈ ఆపరేషన్ గురించి న్యూరో సర్జన్ డాక్టర్ కేకే బన్సాల్ మాట్లాడుతూ సాధారణంగా సర్జరీలు చేసేటప్పుడు బాధితునికి మత్తుముందు ఇస్తారు. బాధితుని స్పృహలో ఉంచే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. డాక్టర్ ఆపరేషన్ చేస్తుండగా లాల్ రామ్ గాయత్రీ మంత్ర జపం చేశాడు.
ఈ సర్జరీ సుమారు నాలుగు గంటల పాటు జరిగింది. ఈ ఆపరేషన్ కోసం హైఎండ్ మైక్రోస్కోప్ వినియోగించారు. ఇది బ్రెయిన్ ఏరియాను మరింత దగ్గరగా చూసేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇటువంటి ఆపరేషన్లను దేశంలోని ఎంపిక చేసిన కొన్ని కేంద్రాల్లో మాత్రమే చేస్తారు. డాక్టర్ బస్సాల్ 2018లోనూ ఇదేవిధంగా అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేశారు.