ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పొల్యూషన్.. ఇది మానవాళి మనుగడకు ఎంతో ముప్పు అని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ పర్యావరణానికి ముప్పు తెస్తున్న పొల్యూషన్ ని మాత్రం మనిషి నియంత్రించలేకపోతున్నాడు. ఇందుకు కారణం ప్లాస్టీక్ వ్యర్థాలు. ప్లాస్టిక్ ప్రభావంతో భూమిపై నివసిస్తున్న ప్రాణులన్నింటికి పెను ప్రమాదం పొంచి ఉన్నది. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టీక్ తో ఇలాంటి ప్రమాదాలు భారీగానే ఉన్నాయి అంటున్నారు. అందుకే చాలా దేశాలు ప్లాస్టీక్ ని నిషేదించాయి.
భారత్ లో పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రిచే పనిలో పడింది ప్రభుత్వం. ఇందుకు గాను సింగిల్ యూజ్ ప్లాస్టీక్ పై నిషేదం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గతంలో సింగిల్ యూజ్ ప్లాస్టీక్ కి దూరంగా ఉండాలని ఎన్నో సార్లు హెచ్చరించామని.. ఇందుకోసం చాలా సమయం ఇచ్చామని జూలై 1వ తేదీ నుంచి ప్లాస్టీక్ నిషేధం అమల్లోకి రానుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ మంగళవారం వెల్లడించారు. వీటికి సంబంధించిన ఉత్పత్తి, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకాలు, వినియోగాలపై పూర్తిగా నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే పాలిస్టెరీస్, పాలి స్టేరిన్ కమొడిటిస్ పై కూడా నిషేదం ఉండబోతున్నట్లు తెలిపారు.
దేశ వ్యాప్తంగా ప్లాస్టీక్ పూర్తి నిషేదం ఉన్నందున..ప్రభుత్వం ఉత్తర్వులను ఉల్లంఘిస్తే జైలు శిక్ష తప్పదని అంటున్నారు. ఒకవేళ నిషేదాన్ని ఉల్లంఘించినట్లయితే.. ఐదేళ్ల వరకు శిక్ష లేదా లక్ష రూపాయలు జరిమానా విధించవొచ్చని అంటున్నారు. ఇక ప్లాస్టిక్పై నిషేధాన్ని కేంద్ర స్థాయిలో సెంటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు.. రాష్ట్ర స్థాయిలో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యవేక్షించబోతున్నట్లు తెలుస్తుంది. ప్లాస్టీక్ వ్యర్ధాల వల్ల మనిషి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని సైంటిస్టులు తెలిపుతున్నారు.
ఇక ప్లాస్టిక్ పదార్థాల్లో స్టైరీన్, బెంజీన్ లాంటి విషపూరిత రసాయనాలుంటాయి. ఇవి కాన్సర్ ముప్పును పెంచుతాయి. ఒక్కసారి మనం వాడిన ప్లాస్టిక్ బ్యాగులు, ఫుడ్ ప్యాకేజీ మరికొన్ని ప్లాస్ట్ ఐటమ్స్, కంటెయినర్లు పర్యావరణంలో కలిసేందుకు ఒక్కోసారి వెయ్యేళ్ల వరకు పడుతుంది. నాడీవ్యాధులు, శ్వాసకోస, ప్రత్యుత్పత్తి సమస్యలు, కిడ్నీ, కాలేయ రుగ్మతలకు దారితీస్తాయి. మరి ఇంత హానికరమైన ప్లాస్టీక్ నిషేదానికి మనవంతు కృషి చేయాలి.. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.