చెడుపై మంచి గెలిచి.. విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇంటి ముందు దీపాలతో అలంకరణ, కొత్త బట్టలు, పిండి వంటలు.. పటాకులు శబ్ధాలతో దీపావళి పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో ఏ పండుగలు సంతోషంగా జరుపుకోలేదు. ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో దేశ వ్యాప్తంగా సంతోషంగా దీపావళి వేడుకలు జరుపుకునేందుకు సిద్దమవుతున్నారు. కానీ.. దేశ రాజధాని ఢిల్లీ లో మాత్రం దీపావళి వేడుకలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. మీడియా సమావేశంలో ఢిల్లీ పర్యావరణ శాఖా మంత్రి గోపాల్ రాయ్ కీలక ప్రకటన చేశారు.
ఇటీవల ఢిల్లీలో భారీ స్థాయిలో కాలుష్యం పెరిగిపోతున్న కారణంగా ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టతరం అవుతుంది. ఈ క్రమంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయంతీసుకుంది. తాజాగా మీడియా సమావేశంలో మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. దీపావళి పండుగ సందర్భంగా బాణా సంచా క్రయ, విక్రయాలపై పూర్తిగా నిషేదం విధించడం జరిగిందని.. బానా సంచా తయారీ, నిల్వ, విక్రయం జరిపితే రూ.5 వేల వరకు జరిమానా, పేలుడు పదార్థాల సెక్షన్ 9బీ ప్రకారం మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.
కాలుష్య నివారణకు ఇప్పటి వరకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం.. ఒకవేల ఈ నిషేదాన్ని ఉల్లంఘించిన క్రాకర్స్ అమ్మినా.. కొనుగోలు చేసినా రూ.200 జరిమానాతో పాటు 6 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని.. ఎక్కడ కూడా నిషేదాన్ని ఉల్లంఘించకుండా 408 బృందాలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేశామని అన్నారు. అయినప్పటికీ ఎవరైనా క్రాకర్స్ కాల్చితే.. అమ్మిన వారికి కొన్నవారికి జరిమానతో పాటు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని అన్నారు. ఈ ఏడాది క్రాకర్స్ తయారు చేయడం, అమ్మడం వాటిపై జనవరి 1 నిషేదం విధించింది. దీపావళి పండుగ కు కూడా ఎలాంటి మినహాంపు ఇవ్వలేదు.
Hon’ble Environment Minister Sh. @AapKaGopalRai Addressing an Important Press Conference | LIVE https://t.co/MgY2RNnCzv
— AAP (@AamAadmiParty) October 19, 2022