దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిజాబ్ వివాదానికి తెర దించింది కర్ణాటక హైకోర్టు. తాజాగా హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. హిజాబ్ పాఠశాలల్లో తప్పనిసరి కాదని కర్ణాటక హైకోర్ట్ తేల్చి చెప్పింది. కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్. దీక్షిత్, జస్టిస్ జె.ఎం. ఖాజీల నేతృత్వంలోని హైకోర్టు బెంచ్.. ఇవాళ వాటిని కొట్టేసింది. హిజాబ్ ధరించడం ఇస్లాం మతానికి సంబంధించి తప్పనిసరి ఆచారం కాదని కర్ణాటక హైకోర్టు పేర్కొంది.
ఇది చదవండి : అభిమాని కుటుంబానికి ప్రభాస్ ఆర్థిక సహాయం!
విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పనిసరి కాదని సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో యూనిఫామ్ ధరించాల్సిందే అని స్పష్టం చేసింది. విద్యాసంస్థల ప్రోటోకాల్స్ ని అంగీకరించాల్సిందే అని పేర్కొంది. స్కూల్ యూనిఫాం సహేతుకమైనదని విద్యార్థి అభ్యంతరం చెప్పలేరని పేర్కొంది. ఇదిలా ఉంటే.. కోర్ట్ తీర్పు నేపథ్యంలో కర్ణాటక వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కర్నాటక హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఇంటి వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శివమొగ, ఉడిపి, కులబురిగి జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. విద్యాలయాలకు సెలవులు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.