ముంబై కోర్టులో ఓ భార్యాభర్తల కేసులో విచిత్రమైన తీర్పు ఇచ్చారు. భర్త .. భార్యకు భరణం చెల్లించడంతోపాటు వారు పెంచుకునే కుక్కలకు కూడా భరణం చెల్లించాలని సంచలన తీర్పు ప్రకటించారు.
సాధారణంగా భార్యాభర్తలు గొడవలు పడడం సహజం. అది ప్రతి ఇంట్లో జరిగే విషయమే. ఏ గొడవలైనా సర్దుకుపోయేవారు సర్దుకుంటారు. లేదంటే విడిపోతారు. అదికూడా కాకుంటే విడాకులు తీసుకుని వేరువేరుగా జీవిస్తుంటారు. మరి విడాకులు కావాలంటే కోర్టుకు వెళ్లాలి. కోర్టులో లాయర్లు, జడ్జి విచారించి విడాకులు మంజూరు చేస్తారు. అయితే విడాకులు తీసుకుంటే భార్య బతకడానికి భర్త భరణం చెల్లించుకోవలసి ఉంటుంది. తాజాగా ముంబై కోర్టులో విచిత్రమైన తీర్పు ఇచ్చారు. భర్త భార్యకు భరణం చెల్లించడంతోపాటు వారు పెంచుకునే కుక్కలకు కూడా భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం..
విడాకుల కేసులో భార్యతోపాటు పెంపుడు జంతువులకు కూడా భరణం చెల్లించుకోవాలని తీర్పు ఇచ్చింది ముంబై కోర్ట్. ఈ తీర్పు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమేనండీ.. భార్యభర్తలు విడాకుల కోసం ముంబై కోర్టుకు వెళ్లగా ఈ విచిత్ర తీర్పు బయటపడింది. ఓ మహిళ తన భర్తనుండి భరణం ఇప్పించాలని కోరుతూ ముంబై కోర్టులో పిటిషన్ వేసింది. ఈ క్రమంలో భార్యతోపాటుగా ఆమె పెంచుకున్న కుక్కలకు కూడా భరణం ఇవ్వాలని తీర్పును వెలువరించింది. మనుషులు ఆరోగ్యంగా జీవితం గడపడానికి పెంపుడు జంతువులు తోడ్పడతాయని.. వాటి యజమానులు విడిపోతే దాని వల్ల మనోవ్యధకు గురవుతారని కోర్టు తెలిపింది. వారు కోలుకోవడానికి పెంపుడు జంతువులు తోడ్పడతాయని కోర్టు తెలిపింది. భార్యతోపాటు ఆమె పెంచుకున్న మూడు కుక్కలకు కూడా భరణం చెల్లించాలని సంచలన తీర్పు ప్రకటించింది.
ఓ మహిళకు 55 ఏళ్ల వయస్సు. 1986లో వివాహం జరిగింది. భర్త బెంగళూరులో బిజినెస్ చేస్తుంటాడు. వారికి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరు కుమర్తెలకు పెళ్లిళ్లు అయిపోయి విదేశాల్లో సెటిల్ అయ్యారు. వ్యాపారంలో ఒడిదుడుకుల కారణంగా భర్త భార్యను వేధించసాగాడు. ఇలా గొడవలు ముదిరి కోర్టు వరకు వెళ్లారు. భార్య ఈ వయస్సులో జీవించడానికి ఎటువంటి ఉపాధి లేకపోవడంతో పైగా తనపై ఆధారపడి మూడు కుక్కలు ఉన్నాయని వాటి సంగతికూడా చూడాలని కోర్టును కోరింది. తన నుండి వేరుగా ఉన్నతన భర్త బెంగళూరులో వ్యాపారం చేస్తున్నాడని ఆధారాలను కోర్టుకు సమర్పించింది. కేసును పూర్తిగా పరిశీలించిన పిదప భార్యకు నెలకు రూ.50,000 మనోవర్తి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ తీర్పు అందరి నోట ఆసక్తికరంగా మారింది. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.