ప్రేమ, పెళ్లి ఈ రెండు పదాల గురించి ఎవరికీ ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ప్రేమ వివాహాలే ఎక్కువగా జరుగుతున్నాయి. సోషల్ మీడియా ప్రాభవం బాగా పెరిగిన తర్వాత ఇన్ స్టెంట్ నూడిల్స్ లాగా ఇన్ స్టెంట్ ప్రేమకథలు కూడా చాలానే పుట్టుకొస్తున్నాయి. సోషల్ మీడియాలో మేసేజ్ లు, పార్కుల్లో షికార్లు తర్వాత పెళ్లి వాయిద్యాలు, మూడు ముళ్లు, ఏడడుగులు చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఈ ఇన్ స్టెంట్ పెళ్లిళ్లు కొందరికి కలిసొస్తున్నా.. ఇప్పుడు చెప్పుకోబోయేలాంటి దురదృష్ట వంతులు కూడా ఉంటారు మరి.
ఇప్పుడు చెప్పుకోబోయే ప్రేమకథ హర్యానా రాష్ట్రం దుర్గాపూర్ కు చెందిన శుక్లాల్ అనే వ్యక్తిది. ఇతను సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు. అలా సోషల్ మీడియాలో బ్రౌజింగ్ చేస్తుండగా.. ఓ అమ్మాయి పరిచయం అయ్యింది. వారి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇంకేముంది పెద్దలను ఒప్పించి వీళ్లు పెళ్లికూడా చేసుకున్నారు. సోషల్ మీడియాలో పరిచయం, చకచకా పెళ్లి జరగిపోవడంతో శుక్లాల్ కార్యం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. శోభనం గదిలోకి జాంజాం అంటూ వెళ్లిన శుక్లాల్ కెవ్వుమంటూ కేకలు వేస్తూ బయటకు వచ్చాడు.
అక్కడితో ఆగకుండా తెల్లారేసరికి పోలిస్ స్టేషన్ పరుగులు పెట్టాడు. తనను రక్షించాలని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. విషయం ఏంటంటే శోభనం గదిలో శుక్లాల్ ఓ నగ్న సత్యాన్ని చూశాడు. అదేంటంటే.. తాను ప్రేమించి పెళ్లిచేసుకుంది అమ్మాయిన కాదు.. ట్రాన్స్ జెండర్ ని. అయితే ఆమె కూడా ఆ విషయాన్ని దాచిపెట్టి అమ్మాయిగా మాయచేసి పెళ్లిచేసుకుందని ఆరోపిస్తున్నాడు. ఈ పెళ్లి తనకొద్దని చెబితే.. విడాకులు ఇవ్వడానికి భరణం డిమాండ్ చేస్తోందట. దాంతో దిక్కుతోచక పోలీసులను ఆశ్రయించాడు.
తనని మోసం చేసి పెళ్లిచేసుకుందని, తనకి ట్రాన్స్ జెండర్ అని తెలియదని కేసు పెట్టాడు. మరి ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో, శుక్లాల్ కు ఎలాంటి న్యాయం జరుగుతుందో చూడాలి మరి. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్ల్ శుక్లాల్ విషయంలో తమాషాగా రియాక్ట్ అవుతున్నారు. ముందూ వెనక చూసుకోకుండానే అలా ఎలా పెళ్లి చేసుకున్నావంటూ కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో హాయ్ అనగానే పెళ్లిదాకా ఎలా వెళ్లావంటూ ఎద్దేవా చేస్తున్నారు.