వేసవికాలం రద్దీ కారణంగా సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ రైళ్లను నడుపుతోంది. ప్యాసెంజర్స్ రద్దీ బాగా ఉండే ప్రాంతాలలో ఈ స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్లు తెలుస్తుంది. రద్దీ ఎక్కకువగా ఉన్నకారణంగా ఈరైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
మనం ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నపుడు సుఖ ప్రయాణం కోసం ఆలోచిస్తాం. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినపుడు రైలు ప్రయాణానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే ట్రైన్లో ఎక్కువగా జర్నీ చేసినా కూడా అలసిపోకుండా ఉంటాం. పిల్లలకు, పెద్దలకైనా బాత్ రూం సమస్య ఉండదు. టైన్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి దూర ప్రాంతాలకు జర్నీ చేయాలంటే రైలు ప్రయాణం సౌకర్యవంతమైనది. వేసవికాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రద్దీ కారణంగా సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. అయితే జనాల రద్దీచే ఈ సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ను మరికొంత కాలం పొడగిస్తున్నట్లు కేంద్రం ప్రయాణికులకు తీపి కబురు తెలిపింది.
హైదరాబాద్-నర్సాపూర్ (రైలు నెంబర్. 07631) ట్రైన్ను జులై 1నుంచి ఆగస్టు 26 వరకు, నర్సాపూర్-హైదరాబాద్ (07632) రైలును జులై 2 నుంచి ఆగస్టు 27 వరకు నడపనున్నారు. హైదరాబాద్-తిరుపతి (07643) రైలు జులై 3 నుంచి ఆగస్టు 28 వరకు, తిరుపతి-హైదరాబాద్ (07644) రైలు జులై 4 నుండి ఆగస్ట్ 29 వరకు సర్వీసులు అందించనుంది. అలాగే మచిలీపట్నం-సికింద్రాబాద్(07185) ప్రత్యేక సర్వీసులు జులై 2 నుండి ఆగస్టు 27 వరకు పొడిగించగా.. సికింద్రాబాద్-మచిలీపట్నం (07186) రైలునుజులై 2 నుంచి ఆగస్టు 27 వరకు నడపనున్నారు.
తిరుపతి-సికింద్రాబాద్(07841) ట్రైన్ జులై 2 నుండి ఆగస్టు 27 వరకు, సికింద్రాబాద్-తిరుపతి(07842) ప్రత్యేక రైలును జులై 3 నుంచి ఆగస్టు 28 వరకు అందుబాటులో ఉంచనున్నారు. షెడ్యూల్లోని మార్పలకు అనుగుణంగా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విజయవాడ-నాగర్సోల్(07698) రైలును జులై 7 నుండి ఆగస్టు 25 వరకు, నాగర్సోల్-విజయవాడ(07699) జులై 8 నుంచి ఆగస్టు 26 వరకు నడపనున్నారు. కాజీపేట-తిరుపతి(07091) ట్రన్ను జులై 4 నుంచి ఆగస్టు 29 వరకు సర్వీసులు అందించనున్నారు.
తిరుపతి-అకోలా (07605) రైలు జులై 7 నుంచి ఆగస్టు 25 వరకు, అకోలా-తిరుపతి 907606) జులై 9 నుండి ఆగస్టు 27 వరకు పొడిగిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఇటీవల రైలు ప్రమాదానికి గురైన ఒడిశాలోని బహంగా బజార్ స్టేషన్ వద్ద రైలు పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో జూన్ 16న పలు ట్రైన్లను రద్దు చేశారు. హోరా-మైసూర్(22817), మైసూర్-హోరా(22818), షాలిమార్-హైదరాబాద్(18045)చ హైదరాబాద్-షాలిమార్(8046) అగర్తల-సికింద్రాబాద్ (07029), సికింద్రాబాద్-షాలిమార్(22850), శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం-హోరా(22832), సంత్రగాచి-చెన్నై సెంట్రల్(22807) మధ్య తిరిగే ట్రైన్లను కూడా నేడు రద్దు చేశారు. రేపటి నుంచి ఈ ట్రైన్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి.