దేశ వ్యాప్తంగా భారీగా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలపై సామన్యులు చుక్కలు చూస్తున్నారు. రోజు రోజుకు పై పైకి ఎగబాకుతున్న పెట్రోల్ రేట్లు మంట పుట్టిస్తున్నాయి. అయితే తాజాగా కేంద్రమంతి నితిన్ గడ్కరీ పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పెరిగిపోతున్న పెట్రోల్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తుందని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలో కేంద్రం రానున్న రోజుల్లో ఫ్లెక్స్ ఇంజన్ పాలసీని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తుందని ఆయన వెల్లడించారు. ఇథనాల్ ఫ్లెక్స్ ఇంజన్లు వాడటం ద్వారా పెరిగిపోతున్న పెట్రోల్ ధరల నుంచి కాస్త ఉపశమనం కలగవచ్చిన ఆయన అన్నారు. దీంతో పాటు భవిష్యత్ కాలం అంతా ఇథనాల్ దేనని, దీనిని రైతులు కూడా ఉత్పత్తి చేసే రోజులు వస్తాయని ఆయన అన్నారు.