గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చమురు సంస్థలు వంట గ్యాస్ తగ్గించాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఈ తగ్గింపును బదాలయిస్తున్నట్లు పేర్కొంది. గతంలో కమర్షియల్, డొమెస్టిక్ గ్యాస్ ధరలు భారీగా పెంచింది. దాంతో మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలను సైతం ఎదుర్కొంది. ధరలకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
తాజాగా చమురు సంస్థలు గ్యాస్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ.36 రూపాయలు తగ్గించింది. ఈ తగ్గింపుతో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 1976 రూపాయలు అవుతుంది. తగ్గింపునకు ముందు ఈ ధర రూ.2012.50 రూపాయలుగా ఉంది. ఈ తగ్గింపు ధరలు ఇవాళ్టి నుంచే అమలులోకి రానున్నాయని తెలిపింది.
ఈక్రమంలో కమర్షియల్ సిలిండర్ ధరను తగ్గించారు కానీ.. గృహ వినియోగాదారులు వాడే డొమెస్టిక్ సిలిండర్ పై ధరను మాత్రం తగ్గించలేదు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర నిరాశకు గురైయ్యారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో గ్యాస్ ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 36 రూపాయల తగ్గింపు తర్వాత రూ.1976.50 రూపాయలుగా మారింది. కలకత్తాలో రూ.2095.50గా, ముంబాయిలో రూ.1936.50కాగా, చెన్నైలో రూ.2141 రూపాయలుగా గ్యాస్ ధరలు ఉన్నాయి. మరి కమర్షియల్ సిలిండర్ పై తగ్గించి, డొమెస్టిక్ సిలిండర్ పై తగ్గించక పోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The price of a commercial LPG cylinder has been cut by Rs 36 from today. With this latest reduction, a 19 kg commercial LPG cylinder will cost Rs 1,976, instead of Rs 2012.50.
— ANI (@ANI) August 1, 2022
ఇదీ చదవండి: Hyderabad : హైదరాబాద్లో కాల్పుల కలకలం.. వ్యాపారి హత్య!
ఇదీ చదవండి: బ్రేకింగ్: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత కూతురు మృతి