దేశం కరోనా కేసులు తగ్గడం లేదు. మహారాష్ట్రలో కరోనా డెల్టా ప్లస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అక్కడ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతుండటం కలవరపెడుతోంది. వ్యాక్సిన్ వేసుకున్నా ఈ వేరియంట్ వదలడంలేదు. మారిపోతున్న వేరియంట్లను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే 2 డోసులు వేయించుకున్న వాళ్లు, మూడో డోస్ కూడా వేయించుకునే అవసరం ఏర్పడిందని చెబుతున్నారు. కరోనా కొత్త వేరియంట్ డెల్టా పై అందరికీ భయాలు ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా డెల్టా వేరియంట్ బారిన పడే అవకాశాలు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఐసీఏంఆర్ అధ్యయనం కూడా ఇదే చెబుతుంది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ ప్రకారం, ఐసీఎంఆర్ అనుమతించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.ఈ మేరకు చెన్నై జర్నల్ లో ఆగస్టు 17వ తేదీన ప్రింట్ అయ్యింది. ఈ అధ్యయనం ప్రకారం సెకండ్ వేవ్ కి కారణమైన డెల్టా వేరియంట్, అటు వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళతో పాటు, తీసుకున్న వారికి కూడా సోకే అవకాశం ఉందని, కాకపోతే వైరస్ ప్రభావంలో మార్పు ఉంటుందని వెల్లడించింది. ఈ అధ్యయనంలో భాగమైన జీరోమ్ తంగిరాజు అనే శాస్త్రవేత్త ప్రకారం, అధ్యయనం చేసిన శాంపిల్స్ చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.
మార్చి 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ మధ్య జరిగిన ఈ అధ్యయన సమయంలో 361మందికి ఆర్టీ–పీసీఆర్ పరీక్ష నిర్వహించగా, అందులో 274 మందికి పాజిటివ్గా తేలింది. వ్యాక్సిన్ రెండు డోస్లు తీసుకున్న 14 రోజుల తరువాత ఈ వ్యక్తులకు వైరస్ సంక్రమించినట్లుగా గుర్తించారు. కోవిషీల్డ్తో పోలిస్తే కోవాగ్జిన్ తీసుకునే వారిలో 77% యాంటీబాడీలు మాత్రమే కనిపించాయని అధ్యయనంలో గుర్తించారు.
ఏది ఏమైనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ డెల్టా వేరియంట్ బారిన పడే అవకాశం ఉన్నదని తెలిపారు. అందువల్ల కరోనా నియమాలను ఖచ్చితంగా పాటించాలని, అజాగ్రత్తగా ఉండకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండడం మంచిదని సూచించారు.