మూడేళ్ల క్రితం అంటే 2019 ఫిబ్రవరి14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా పాకిస్థాన్ ను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని , ఆక్రోశాన్ని తెలియజేశారు. అయితే ఈఘటనపై దేశమంతా ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఉంటే బెంగళూరు చెందిన ఓ విద్యార్ధి ఉగ్రదాడిలో జవాన్లు మరణించడం పట్ల సంబరాలు చేసుకున్నాడు. తాజాగా ఆ విద్యార్ధికి న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. తీర్పుతో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
2019 ఫిబ్రవరి 14న జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులు ప్రయాణిస్తున్న వాహనాల కాన్వాయ్ అవంతిపురా సమీపంలోకి రాగానే ఉగ్రవాదులు కారుతో ఆత్మాహుతి దాడి పాల్పడ్డారు. ఈ ఘటనలో 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు. పాకిస్తాన్ కేంద్రంగా ఏర్పాటైన ఓ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ ఈ దాడిని తమ బాధ్యత ప్రకటించుకుంది. ఆత్మహుతి దాడికి పాల్పడింది కాశ్మీరీ అయిన ఆదిల్ అహ్మద్ దార్ అని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో యావత్ భారతదేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. దేశ ప్రజలందరు ఈ ఉగ్రవాద చర్యను పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. అమరులైన 40 జవాన్లకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళర్పించారు. ఇంతాల దేశం మొత్తం బాధతో ఉంటే కర్ణాటక రాష్ట్రం బెంగళూరు చెందిన ఫయాజ్ రషీద్ అనే విద్యార్ధి ఈ దాడిని సమర్ధించాడు. అంతే కాక అతడు ఫేస్ బుక్ లో ఉగ్రదాడిని సమర్ధిస్తూ పోస్టులు పెట్టాడు.
దీంతో అది కాస్తా వైరల్ అయ్యి.. బెంగళూరు పోలీసులకు చేరింది. దీంతో అతడి అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచారు. ఇక అప్పటి నుంచి విచారణ సాగుతున్న ఈ కేసుపై తాజాగా తీర్పు వెలువడింది. అతడు ఉద్దేశపూర్వకంగానే ఆ పోస్టు పెట్టాడని రుజువు కావడంతో ప్రత్యేక న్యాయస్థానం అతడి ఐదేళ్లు జైలు శిక్ష వేసింది. పుల్వామా ఘటనపై అనుచిత వ్యాఖ్యలు.. విద్యార్థికి ఐదేళ్ల జైలు శిక్ష శిక్షతో పాటు రూ.25 వేలు జరిమాన కూడా విధించాడు. అంతే కాక శిక్షా సమయంలో ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడిన మరో 6 నెలల అదనపు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ప్రొబేషన్ సమయంలో సత్ప్రవర్తన కింద విడుదల చేయాలని దోషి తరపు న్యాయవాది కోర్టును కోరాడు.
దీంతో అతడి పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశభక్తులు ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సమయంలో సంబరాలు చేసుకోవడం చూస్తుంటే అతడు ఎలాంటి వాడో తెలుస్తోందని న్యాయమూర్తి జస్టీస్ గంగాధర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పోస్టు పెట్టిన సమయంలో ఆయనేమి చదువురాని వాడు కాదు, ఏదో సాధారణ కూలీ పనులు చేసుకునే వ్యక్తో కాదు. ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ అని పేర్కొన్నారు. జవాన్లను చంపడాన్ని అతడు సమర్ధించిన విధానం ఘోరమైన నేరమని కోర్టు స్పష్టం చేసింది. సదరు వ్యక్తికి శిక్షపడటంతో స్థానికులు సంబరాలు జరుపుకున్నారు. మరికొందరు అతడిపై కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ‘ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తూ సంబరాలు చేసుకో’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.