ప్రపంచవ్యాప్తంగా కరోనా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తాజాగా హడలెత్తిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా డేల్టావేరియంట్ కన్నా మరింత రెట్టింపుతో ఒమిక్రాన్ పంజా విసురుతుంది. ఇక దేశంలోనూ కరోనా కేసులు పెరుగుతూ థార్ధ్ వేవ్ సంకేతాలను ఇస్తుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కాలేజీలు, స్కూళ్లు, కార్యాలయాలలో వందల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి.
పంజాబ్ లోని కాలేజీలు కోవిడ్ హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి. తాజాగా పాటియాలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 మందికి కోవిడ్ నిర్ధారణ అయినట్లు పంజాబ్ మంత్రి రాజ్ కుమార్ వెర్కా చెప్పారు. వీరిలో 60 మంది డాక్టర్లు, 30 మందికి పైగా విద్యార్ధులు ఉన్నారు. హాస్టల్స్ లో ఉంటున్న విద్యార్ధులందరూ తమ గదులను ఖాళీ చేయాలని జిల్లా యంత్రాంగం అదేశించింది.
ఇది చదవండి : అరుదైన ఘటన.. రెండు వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన కవలలు..!
గతవారం పాటియాలా లోని థాపర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన దాదాపు 93 మంది విద్యార్ధులకు కోవిడ్ సోకగా.. ఇప్పుడు మెడికల్ కాలేజీలో 100 మందికి పాజిటీవ్ నిర్ధారణ కావడం కలకలం సృష్టిస్తుంది. అయితే విద్యార్ధులు ఎక్కువ సంఖ్యలో సమావేశం కావటం వల్లే థాపర్ యూనివర్సిటీలో కోవిడ్ కేసులు నమోదైనట్లు పాటియాలా డిప్యూటీ కమీషనర్ సందీప్ హన్స్ తెలిపారు. కరోనా కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. పరిసర ప్రాంతాల్లో శానిటైజేషన్ చేయిస్తున్నామని.. అందరూ తప్పకుండా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు.