ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ అంటే భయంతో వణికిపోతున్నారు. దక్షిణాఫ్రికాలో మొదలైన కరోనా కొత్త వేరియంట్ వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపించింది. సగం కన్నా ఎక్కువ దేశాల్లో ఓమిక్రాన్ విస్తరించింది. ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో కల్లోకం కలిగిస్తోంది. యూకేలో కేసుల సంఖ్య లక్షకు చేరువ అవుతోంది.
ఇదిలా ఉంటే ఇండియాలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత కొన్ని రోజుల్లోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నారు. ఆంక్షలకు అణుగుణంగా మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. సీఎం బసవరాజ బొమ్మై నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఆదివారం సమావేశమైంది.
ఇది కూడా చదవండి : ఇంద్రజ లాహే డ్యాన్స్ కి మెగాస్టార్ ఫిదా..!
డిసెంబరు 28 నుంచి 10 రోజులపాటు రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. అత్యవసర సేవలు, ఆసుపత్రికి వెళ్లేవారు, ఇతర ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్న ప్రయాణికులపై ఎలాంటి నిర్భంధం ఉండదని స్పష్టం చేశారు.