భారతీయ సంస్కృతిలో ఆవు చాలా ముఖ్యమైందని జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా ఆవు మాంసం తినడం అనేది ఎవరికీ ప్రాథమిక హక్కుకాదని తెలిపిన కోర్టు దానిని పూజించడంమే కాక దానిపై ఆధారపడి జీవనం సాగించే వారికి ప్రాథమిక హక్కుగా పరిగణించాలని కోరారు. హిందువులకు పూజనీయమైన గోవు విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆవును దొంగిలించి శిరచ్ఛేదం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జావేద్ అనే వ్యక్తికి బెయిలు నిరాకరించిన జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్తో కూడిన ధర్మాసనం చంపే హక్కు కంటే జీవించే హక్కు ఉన్నతమైనదని పేర్కొంది. గోమాంసాన్ని భుజించడం హక్కు కానేకాదని తేల్చి చెప్పింది. నిందితుడిని బెయిలుపై విడుదల చేస్తే మళ్లీ అటువంటి నేరానికే పాల్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
సంస్కృతి, విశ్వాసాలు దెబ్బతినే దేశం బలహీనంగా మారుతుందని వ్యాఖ్యానించిన ధర్మాసనం గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తూ, దానికి హాని తలపెట్టే వారిని కఠినంగా శిక్షించేలా పార్లమెంటు ఓ చట్టం తీసుకురావాలని కేంద్రానికి సూచించింది. గోవు ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకున్న వారిలో ముస్లిం పాలకులు కూడా ఉన్నారని న్యాయస్థానం గుర్తు చేసింది. భారత సంస్కృతిలో గోవుకు విశిష్ట స్థానం ఉందని, ప్రాథమిక హక్కు అనేది గోమాంసం భుజించే వారికి ప్రత్యేకం ఏమీ కాదని తేల్చి చెప్పింది. ఆవులను చంపేవారికి ప్రస్తుతం మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నారని గుర్తు చేసింది. అయితే ఆవును చంపితే ఇక ముందు జీవితఖైదు విధించాలని రాజస్థాన్ హై కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
గతంలోనే (2020 జూన్ లో ) గోవధ నియంత్రణపై యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్కు ఆమోదం తెలిపిన క్రమంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఏఐఎంఐఎం నేత సయ్యద్ అసీం వకార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గోమాతను కాపాడేలా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఓ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని కోరారు. పాలివ్వని ఆవులను అమ్మేవారిని కూడా కఠినంగా శిక్షించి రూ 20 లక్షల జరిమానా విధించాలని అన్నారు. ఆ