భారతీయ సంస్కృతిలో ఆవు చాలా ముఖ్యమైందని జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా ఆవు మాంసం తినడం అనేది ఎవరికీ ప్రాథమిక హక్కుకాదని తెలిపిన కోర్టు దానిని పూజించడంమే కాక దానిపై ఆధారపడి జీవనం సాగించే వారికి ప్రాథమిక హక్కుగా పరిగణించాలని కోరారు. హిందువులకు పూజనీయమైన గోవు విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆవును దొంగిలించి శిరచ్ఛేదం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జావేద్ అనే వ్యక్తికి బెయిలు నిరాకరించిన జస్టిస్ శేఖర్ […]