దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. దీంతో రోజురోజుకు కరోనా బాధితులు అధికమవుతున్నారు. నిన్న దేశంలో 33,750 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసులు 3,49,22,882కు చేరాయి. అలాగే, నిన్న 10,846 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. 123 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారని వివరించింది.
దేశంలో మొత్తం 3,42,95,407 మంది కోలుకున్నారని, నిన్న ఒక్కరోజులో 10,846 మంది కోలుకున్నట్టు బులిటెన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 1,45,582 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. భారత్లో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 4,81,893 కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా 1,45,68,89,304 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. దేశంలో కరోనా కేసులు పెరగడంతో పాటు ఒమిక్రాన్ విజృంభన కొనసాగుతుంది.
ఇది చదవండి : హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన సినిమా ధియేటర్
ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, పార్కులు, జిమ్లు వంటి వాటిని మూసివేశారు. కేసులు ఇలానే పెరిగితే మరిన్ని ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/wYaXyBZkmy pic.twitter.com/oXuK6xtFl3
— Ministry of Health (@MoHFW_INDIA) January 3, 2022