దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తోంది. ఒక వైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ తో ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. ఈ మహమ్మారి భయంతో కొత్త సంవత్స వేడుకలకు సైతం దూరంగా ఉన్నారు. అయిన దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిపోయింది. మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది.ఈ మేరకు వివరాలు తెలుపుతూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
ఇది చదవండి : వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మృతి
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ లో వివరాలు వెల్లడించింది. దేశంలో మొన్న 16,764 కేసులు నమోదు కాగా, నిన్న ఒక్కరోజే భారీస్థాయిలో 22,775 కేసులు నమోదయ్యాయి.. నిన్న కరోనా నుంచి 8,949 మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజులో 406 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,04,781 మంది కరోనా చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.32 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 1,431కు పెరిగింది.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/1PHH03oYra pic.twitter.com/AYImiF6pQb
— Ministry of Health (@MoHFW_INDIA) January 1, 2022