దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. రెండో దశ కరోనా తర్వాత.. 27,553 రోజువారీ కరోనా కేసులు రావడం ఇదే ప్రథమం. అన్ని రాష్ట్రాలు కరోనా కట్టడికి పూనుకున్నాయి. కొత్త మార్గదర్శకాలను సైతం విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగా బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. జనవరి 3 నుంచి అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలను మూసివేయాలని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం ఉద్యగులతోనే పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక రాష్ట్రంలో స్విమ్మిగ్ పూల్స్, వ్యాయామశాలలు, జూలు, సెలూన్స్, స్పాలు, పార్కులు అన్నింటిని మూసివేయాలని బెంగాల్ ప్రభుత్వం ఆదేశించింది.
#COVID19 | All schools, colleges, universities, spas, salons, beauty parlours, zoos, and entertainment parks to be closed in the state from tomorrow: West Bengal Chief Secretary HK Dwivedi pic.twitter.com/7EUObVh6Yy
— ANI (@ANI) January 2, 2022
బెంగాల్ లో రాత్రి కర్ఫ్యూను అమలు చేయనున్నారు. రాత్రి 10 నుంచి తర్వాతి రోజు తెల్లవారుజామున 5 గంటల మధ్య కేసవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. కోల్ కతా మెట్రో సర్వీసులు కూడా 50 శాతం సామర్థ్యంతోనే కొనసాగనున్నాయి. లోకల్ ట్రైన్లు రాత్రి 7 గంటల వరకు మాత్రమే నడుస్తాయి. సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, బార్లు 50 శాతం సామర్థ్యంతో రాత్రి 10 గంటల వరకు మాత్రమే నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. షాపింగ్ మాల్స్ లోనూ 50 శాతం ఆక్యుపెన్సీతోనే కొనసాగాలని నిర్ణయించారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, మత కార్యక్రమాలు, మీటింగ్లకు 50 మందికే అనుమతి. అంత్యక్రియలకు కేవలం 20 మందికే అనుతినిచ్చారు.
COVID-19: West Bengal govt announces closure of all educational institutions; offices allowed to operate with 50% workforce; only essential services permitted from 10 pm to 5 am
— Press Trust of India (@PTI_News) January 2, 2022
కరోనా కేసుల విషయానికి వస్తే మహారాష్ట్ర, కేరళ తర్వాత బెంగాల్ లోనే ఎక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయి. బెంగాల్ లో శనివారం 4,512 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. వాటితో కలిపి బెంగాల్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 13,300కు చేరింది. వాటిలో 20 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా ఉన్నాయి. పరిస్థితి ఇంకా చేయి దాటిపోకూడదనే ముందుగానే కరోనా ఆంక్షలను కఠినతరం చేసినట్లుగా తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ తో మూడో దశ కరోనా తప్పదనే భావనలు వినిపిస్తున్నాయి. వాటికి బలం చేకూర్చేలా దేశంలో రోజువారీ కేసులు సైతం పెరుగుతున్నాయి. బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
West Bengal records 4,512 fresh #COVID19 cases, 1,913 recoveries, and 9 deaths today
Active cases: 13,300
Total recoveries: 16,09,924
Death toll: 19,773 pic.twitter.com/Jskk4SjBvQ— The Times Of India (@timesofindia) January 1, 2022