గత రెండు నెలలు గా దేశంలో కరోనా విజృంభణ కొనసాగింది. పది వేల నుంచి ఏకంగా మూడు లక్షల వరకు కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎఫెక్ట్ బాగా పడింది. దీంతో పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లోకి తీసుకు వచ్చింది. అయితే దేశ వ్యాప్తంగా యుద్ద ప్రాతిపదికన వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నారు. వ్యాక్సినేషన్ తీసుకోవడం కరోనా భారిన పడ్డా త్వరగా కోలుకుంటున్నారు. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 83,876 కేసులు నమోదు అయ్యాయి. దాదాపు 895మంది మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాలు 5,02,874గా ఉన్నాయి.
ఇది చదవండి: మారణ హోమం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య
గడచిన 24 గంటల్లో 1,99,054 మంది రికవరీ అయ్యారు. కొత్త కేసులు తగ్గుతున్నా మరణాలు మాత్రం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో రికవరీ రేటు 96.19 శాతంగా ఉంది. మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,06,60,202కి చేరింది. ఇక, రోజువారీ పాజిటివిటీ రేటు 7.25 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 11,08,938కు పడిపోయాయి. అలాగే, గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,70,053టీకా డోసులను పంపిణీ చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఇచ్చిన మొత్తం 1,69,63,80,755 మంది టీకాలు వేయించుకున్నారు.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/DmnW6kanpU pic.twitter.com/06W1fEECj9
— Ministry of Health (@MoHFW_INDIA) February 7, 2022