దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో.. ఇప్పుడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడపుట్టిస్తోంది. ఒకే నెలలో చూస్తుండగానే కేసుల సంఖ్య పదుల నుంచి వందలకు చేరింది. భారత్లో ఇప్పటివరకు 578 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ నుంచి ఇప్పటివరకు 151 మంది కోలుకున్నారని వివరించింది.
ఈ కేసులు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణలో ఉన్నాయి. ఢిల్లీ అత్యధికంగా 142 కేసులు ఉండగా.. మహారాష్ట్రలో 141 కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,531 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 75,841 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. నిన్న కరోనా నుంచి 7,141 మంది కోలుకున్నారు.
ఇదీ చదవండి : ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం.. శంకర్ దాదా సింగర్ ఇక లేరు
దేశంలో రికవరీ రేటు 98.40 శాతానికి చేరింది. ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,47,93,333 కి చేరగా.. కోలుకున్న వారి సంఖ్య 3,42,37,495కి పెరిగింది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 142 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు మొత్తం ఆరుగురికి ఒమిక్రాన్ సోకగా ఒకరు కోలుకున్నారు. తెలంగాణలో ఒమిక్రాన్ 41 మందికి సోకగా, 10 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/6SMyeEwtST pic.twitter.com/5A3QLkDUFH
— Ministry of Health (@MoHFW_INDIA) December 27, 2021