దేశంలో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నా కొత్త వేరియంట్ దడపుట్టిస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. ఇటీవల కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. రోజూ 10వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నా.. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. భారత్లో ఇప్పటివరకు 358 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,650 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే విధంగా నిన్న 7,051 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో ప్రస్తుతం 77,516 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. నిన్న కరోనా వల్ల 374 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. 576 రోజుల తర్వాత క్రీయాశీల కేసుల సంఖ్య ఈ గణనీయంగా తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది.
ఇది కూడా చదవండి : KFC చికెన్ ఆర్డరిస్తే.. ఏకంగా కోడి తలకాయ వచ్చింది
కరోనా నుంచి మొత్తం 3,42,15,977 మంది కోలుకున్నారని తెలిపింది. ఇప్పటివరకు కరోనా వల్ల సంభవించిన మొత్తం మరణాల సంఖ్య 4,79,133 అని వివరించింది. ఇప్పటివరకు మొత్తం 140,31,63,063 వ్యాక్సిన్ డోసులను వినియోగించినట్లు వివరించింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98 శాతానికిపైగా ఉంది.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/w7bTeypumG pic.twitter.com/LIBJ5kaemJ
— Ministry of Health (@MoHFW_INDIA) December 24, 2021