ఈ మద్య మనుషులు డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. ఆకు కూరలు, కూరగాయలు, పండ్ల రసాల చివరికి చిన్నా పెద్ద తాగే పాలు సైతం కల్తీ చేస్తున్నారు.
ఈ మద్య ఎక్కడ చూసినా కల్తీ పేరు బాగా వినిపిస్తుంది. మనం తినే కూరగాయలు, ఆహార పదార్థాలు, పండ్లు, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్.. చివరికి పాలు సైతం కల్తీ చేస్తున్నారు కల్తీరాయుళ్లు. మరికొన్ని చోట్లు ఆకు కూరలు, కూరగాయలు ఫ్రెష్ గా ఉండాలని సమీపంలోని మురికి నీటిలో శుభ్రం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఓ కొబ్బరి బోండాల వ్యాపారి చేసిన పని చూస్తే ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటారు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో రోడ్డు పక్కన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వ్యాపారి చేసిన పని ఏంటీ అన్న విషయం గురించి వివరాల్లోకి వెళితే..
ఈ మద్య కాలంలో కొంతమంది ఎదుటి వారికి ఏమైనా పరవాలేదు.. తాము బాగుండాలని అనుకుంటున్నారు. కొంతమంది చిరు వ్యాపారులు చేస్తున్న పాడు పని వల్ల ప్రజలు ఆరోగ్యం రిస్క్ లో పడుతుంది. పానీ పూరీ లో కలుషిత నీరు కలపడం, ఆకు కూరలు, కూరగాయలు మురికి నీటితో కడగడం లాంటివి చేస్తూన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో రోడ్డు పక్కన కొబ్బరి బోండాలు అమ్ముతున్న వ్యక్తి బోండాలు ఫ్రష్ గా ఉండాలనే ఉద్దేశంతో మురికి కాలువలో ఉన్న నీళ్లను చల్లుతున్నాడు. ఇది తెలియక జానాలు కొబ్బరి బోండాలు తాగుతున్నారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ వేడిమి తట్టుకోలేక చల్లని పానియాలు, కొబ్బరి బొండాలు వైపు పరుగులు తీస్తున్నారు జనాలు. ఈ క్రమంలో సమీర్ అనే కొబ్బరి బోండా వ్యాపిరి ఎండ వల్ల కొబ్బరి బోండాలు తాజాదనం కోల్పోతున్నాయని.. అవి ఫ్రష్ గా కనిపించేలా చేయాలని పక్కనే ఉన్న మురికి నీటిని తీసుకు వచ్చి వాటిపై చల్లుతున్నాడు. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో వీడియో తీసి అప్ లోడ్ చేశాడు. అది కాస్త వైరల్ కావడంతో అక్కడి ప్రజలు కంగారు పడ్డారు. డబ్బు సంపాదన కోసం మనుషుల ప్రాణాలతో ఆడుకుంటావా అంటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు కొబ్బరికాయ వ్యాపారిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సమీర్ (28) ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాకు చెందినవాడ.. డ్రైన్ నుండి నీటిని సేకరించి తన బండిపై ఉన్న బోండాలపై పోయడం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటమే.. ఈ నేపథ్యంలో అతనిపై సెక్షన్ 270 కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Sameer Miyan was arrested by the UP police for washing coconut with dirty drain water.
And when we talk about boycotting such elements, people start calling us bigot… pic.twitter.com/hpUMZ5uomy
— Mr Sinha (@MrSinha_) June 6, 2023
उक्त प्रकरण में थाना बिसरख पुलिस द्वारा आरोपी अभियुक्त को गिरफ्तार कर नियमानुसार विधिक कार्रवाई की गई। pic.twitter.com/8BxvMQmZWf
— POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) June 5, 2023