ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక లోపం, వాతావరణం అనుకూలించకపోవడం.. ఇలా కారణం ఏదైన విమానాలు, హెలికాఫర్ట్ లు కూలిపోతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొన్ని ప్రమాదాల్లో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నారు. ఇటీవలే నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా రాజస్థాన్ లో మరో ఘోర ప్రమాదం జరిగింది.
రాజస్థాన్ లోని భరత్ పూర్ లో చార్టర్డ్ విమానం కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సాంకేతిక లోపంతోనే ఈ విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. విమానం కూలిన స్థలానికి అధికారులు, పోలీసులు హుటాహుటినా తరలి వచ్చారు. విమానం కూలిన ప్రాంతంలో సహాయక చర్యలు, పునరావాస పనులు చేపట్టామని భరత్ పూర్ జిల్లా కలెక్టర్ అనూప్ రంజన్ తెలిపారు.
అలానే ఈ ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు మధ్యప్రదేశ్ లో రెండు యుద్ధ విమానాలు ఒకాదానినొకటి ఢీకొని కుప్ప కూలిపోయాయి. ఈ మూడు విమానాల ప్రమాద ఘటనల పై అంతర్గత విచారణకు భారత వాయుసేన ఆదేశించింది. విమానాలు కూలిన ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. వాయుసేన ఉన్నతాధికారులు అనిల్ చౌహాన్, ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ చౌదరిలకు ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు. గంటల వ్యవధిలో ఇలా విమానాలు కూలిపోయిన ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.