భారత అంతరిక్షరంగంలో మరో నూతన అధ్యయనానికి తెరలేచింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. ఈ రోజు చంద్రయాన్ ను విజయవంతంగా ప్రయోగించింది. దీంతో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.
చంద్రమండలంపై పరిశోధనలు నిర్వహించేందుకు భారత అంతరిక్షప పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్ -3 ప్రయోగాన్ని చేపట్టింది. చంద్రుడి దక్షిణ దృవంపై రోవర్ ను ల్యాండ్ చేసి అక్కడి వాతావరణాన్ని పరిశోదించి విశ్వం ఆవిర్భావం గురించి లోతుగా అధ్యయనం చేయడానికి ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఇప్పటికే చంద్రయాన్ 1, 2 ప్రయోగాలను చేపట్టింది. చంద్రయాన్ -1 చంద్రుడిపై నీటి జాడను కనిపెట్టింది. చంద్రయాన్-2 ను కూడా చేపట్టిన ఇస్రో చివరి దశలో సాఫ్ట్ ల్యాండ్ చేయలేక ఆ ప్రయోగం విఫలమైంది. కాగా తాజాగా చంద్రయాన్ -3 ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగాన్ని చంద్రయాన్-3 ని విజయవంతంగా ప్రయోగించారు. ఎల్వీఎం -3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఆగస్టు 23న లేదా 24న చంద్రుడి దక్షిణ దృవంపై ల్యాండర్ ల్యాండ్ కానుంది. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమించి చంద్రయాన్ -3 లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చంద్రయాన్-3 లో ప్రపొల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్లలో అత్యాధునిక సాంకేతిక పరికరాలను అమర్చి పంపుతున్నారు. ఈ వాహన ప్రయాణం 40 రోజులు సాగనుంది. ఈ ప్రయోగంతో చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేసి విశ్వానికి సంబంధించిన అనేక విషయాలను వెలుగులోకి తెచ్చేందుకు మార్గం సుగమం అవుతుందని సైటింస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
#Chandrayaan3#India #ISRO #isroindia #jaishreeRam 🚩🚩🚩 pic.twitter.com/dqR8Qrzayj
— Aditya kumar (@adityagupta_418) July 14, 2023