తెలంగాణ లో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే ద్విచక్రవాహనదారులకు సైబరాబాద్ పోలీసులు షాక్ ఇవ్వనున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ఏదైనా ప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని.. హెల్మెట్ ధరించిన వారు కొన్ని ప్రమాదాల నుంచి సురక్షితంగా బయట పడుతున్నారని పలు సంఘటనలు రుజువు చేశాయి. బైక్పై ప్రయాణించేవారికి హెల్మెట్ ఎంతగానో భద్రతనిస్తుంది. అందుకే హెల్మెట్ తప్పని సరి ప్రభుత్వం అంటుంది.
ఇది చదవండి: సీఎం కేసీఆర్ కి అధిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన నాగార్జున!
ఇప్పటి వరకు పెద్దవారికి మాత్రమే హెల్మెట్ పెట్టుకోవాలనే రూల్ ఉంది. తాజాగా ఆ నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రకటించింది. నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మోటార్సైకిళ్లపై సేఫ్టీ హానెస్లు, క్రాష్ హెల్మెట్లను తప్పనిసరిగా ఉపయోగించాలని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ బుధవారం కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. అంతే కాదు ద్విచక్ర వాహనం దారులు నాలుగేళ్లలోపు పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్న మోటారు సైకిల్ వేగం గంటకు 40 కిమీ కంటే ఎక్కువ ఉండదని కొత్త నిబంధనలు పేర్కొంటున్నాయి.
ఒక వేళ ఈ రూల్స్ గనక పాటించకపోతే.. 3 నెలల జైలు శిక్షతో పాటు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, రూ.1000 జరిమానా విధించబడుతుందని కేంద్రం తెలిపింది. అంతే కాదు చిన్న పిల్లల కోసం హెల్మెట్లను తయారు చేయాలని తయారీదారులను కోరింది.