దేశంపై విషం చిమ్ముతున్న పలు యూట్యూబ్ ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్లను, వైబ్ సైట్లతో పాటుగా వాటి ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.
నకిలీ వార్తలను, దేశాన్నీ అగౌరవ పరిచేలా వ్యతిరేక కంటెంట్లను ప్రచారం చేస్తోన్నారనే ఆరోపణలతో ముప్పై ఐదు యూట్యూబ్ ఛానళ్లను, రెండు ట్విట్టర్ ఖాతాలను, రెండు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను, రెండు వెబ్ సైట్ల ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ ఛానళ్లు దేశంలోని సున్నితమైన అంశాలపై తప్పుగా ప్రచారం చేస్తున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానళ్లలో ఖబర్ విత్ ఫాక్ట్స్, గ్లోబల్ ట్రూత్, ఇన్ఫర్మేషన్ హబ్, అప్నీ దున్యా టీవీ, బోల్ మీడియా టీవీ. వీటితో పాటు మరికొన్ని ఛానళ్లు ఉన్నాయి. అలాగే వైట్ ప్రొడక్షన్స్.కామ్.పీకే, డ్నో మీడియా.కామ్ వెబ్ సైట్లను నిషేధించారు.
ఇది కూడా చదవండి : సుప్రీంకోర్టు ఆవరణలో నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
గత ఏడాది డిసెంబర్ లో కూడా కేంద్ర ఐటీ శాఖ నకిలీ వార్తలను వ్యాప్తి చేసిన ఇరవై యూట్యూబ్ ఛానళ్లు, రెండు వెబ్ సైట్ లను బ్యాన్ చేసింది. ఆయా ఛానళ్లు కశ్మీర్, భారత ఆర్మీ, దేశంలోని మైనారిటీ, రామమందిరం మొదలైన అంశాలపై విద్వేషపూరిత కంటెంట్ ను పోస్ట్ చేస్తున్నట్టుగా మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో ఐటీ రూల్స్ ప్రకారం యూట్యూబ్ ఛానళ్లు, వెబ్ సైట్లపై చర్యలు తీసుకుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.