తాజాగా యోగా గురువు రామ్ దేవ్ బాబా కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ సీరియల్స్, సినిమాలపై చేసిన ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి.
ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా అప్పడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇలాగే గతంలో ఆయన అనేక వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా కూడా రామ్ దేవ్ బాబా కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ సీరియల్స్, సినిమాలు, పోర్నో గ్రఫీ అనేవి యువతను చెడు మార్గాల్లోకి తీసుకెళ్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఫిబ్రవరి 20 నుంచి గోవాలోని మిరామార్ బీచ్లో మూడు రోజుల పాటు యోగా శిబిరం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రామ్ దేవ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో అసభ్యత విస్తరిస్తున్న తీరు అందోళన కలిగిస్తుందని అన్నారు. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో టీవీ సీరియల్స్, సినిమాలు, పోర్నో గ్రఫీ అనేవి యువతను చెడు మార్గాల వైపు నడిచేలా దోహదపడుతున్నాయని తెలిపారు. ఇక నేటి కాలం యువత చెడు సినిమాలు, చెడు కంటెంట్ కు మోసపోకూడదన్నారు.
ఇలాంటి అసభ్యకత చూపించే మార్గాల వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయితే ఇలాంటి చెడు మార్గాల్లో పయనించేవారిని అధ్యాత్మిక విద్య ద్వారా మంచి మార్గం వైపు నడిపించాలని రామ్ దేవ్ బాబా తెలిపారు. ఇకపోతే ఈ నెల 20 నుంచి మిరామార్ బీచ్లో మూడు రోజుల పాటు యోగా శిబిరం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి అందరూ పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయన తెలిపారు. యోగా గురువు రామ్ దేవ్ బాబా తాజాగా చూసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.