ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్నో అద్భుత దృశ్యాలు మన కళ్ల ముందు ఆవిష్కరించబడుతున్నాయి. కొన్ని కడుపుబ్బా నవ్విస్తుంటే.. మరికొన్ని గుండెల్లో వణుకు పుట్టించే విధంగా ఉంటున్నాయి. సాధారణంగా మనిషి దేవుడు అంటే ఎంత భక్తి భావంతో ఉంటాడో.. దెయ్యం అంటే అంతగా వణికిపోతాడు. మన చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు దెయ్యాం అంటూ భయపెడుతూనే ఉంటారు. దెయ్యాలు లేవని హేతువాదులు అంటుంటే.. ఇప్పటికీ అవి మాకు కనిపిస్తుంటాయని కొంతమంది భయపడుతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది.
ఒక ఆటో రిక్షా దానంతట అదే స్టార్ట్ అయి రెండు కార్లను ఢీ కొట్టింది.. ఆ సమయంలో డ్రైవర్ కూడా లేడు. కానీ ఒక డ్రైవర్ ఎంత పాస్ట్ గా నడుపుకుంటూ వచ్చి ఢీ కొడుతాడో ఆ రేంజ్ లో యాక్సిడెంట్ అయ్యింది. ఈ సీన్ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. అసలు ఇది ఎలా సాధ్యమవుతుందని.. ఎవరూ నడపకుండా దానంతట అదే కదిలి అంత ఫాస్ట్ గా ఎలా వెళ్లిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆటో ని ఒక వ్యక్తి ఆపడానికి ప్రయత్నించాడు.. కానీ ఆపలేకపోయాడు. ఈ వీడియో చూసి ఆటోరిక్షాను ఏదో దెయ్యం నడిపి ఉండొచ్చు అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.