ప్రపంచంలో అద్భుత కట్టడాల్లో ఒకటైన తాజ్మహల్ గత కొంత కాలంగా రక రకాలుగా చర్చ జరుగుతోంది. గత కొంత కాలంగా తాజ్ మహల్లో ఉన్న గదుల్లో హిందువులకు సంబంధించిన ఎన్నో విగ్రమాలు దాచి ఉంచారని వాటిని బయటకు తీయాలని కొన్ని వర్గాల వారు వాదిస్తూ వస్తున్నారు. తాజ్మహల్లో ప్రస్తుతం కొన్ని గదులు మూసి ఉంచారని వాటిని తెరిపించాల్సిందిగా అలహాబాద్ హైకోర్టు పిల్ దాఖలు చేశారు. తాజాగా ఆ పిల్ ని గురువారం తిరస్కరించింది.
ఈ నేపథ్యంలో పిల్ దాఖలు చేసిన పిటీషన్ దారుపై లక్నో బెంచ్ న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చారిత్రక కట్టడంపై ఆరోపణలు చేసే ముందు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. పూర్తి స్థాయి పరిశోధన చేసిన తర్వాతే.. పిల్ వేయాలని పిటిషనర్ని మందలిచింది. అంతే కాదు ఈ నిర్మాణం ఎవరు నిర్మించారు.. ఎవరు ఎందుకు కట్టించారన్న విషయంపై పూర్తిగా తెలుసుకోవాలని చివాట్లు పెట్టింది. కాగా, తాజ్మహల్ ముంతాజ్ స్మారకం కాదని ఒకప్పటి హిందూ దేవాలయమని ప్రచారంలో ఉంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.