సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జవాన్లతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 16 మంది భారత జవాన్లు మృత్యువాత పడగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 13 మంది జవాన్లు, ముగ్గురు అధికారులు ఉన్నట్లు సమాచారం. భారత-చైనా సరిహద్దు ప్రాంతంలో.. చాటేన్నుంచి తంగూ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మూడు ఆర్కీ వాహనాల కాన్వాయి థాంగు వైపు వెళ్తుండగా ఒక ట్రక్కు మలుపు తిరుగుతూ ప్రమాదవశాత్తూ లోయలోకి జారిపడింది. ట్రక్కు మలుపు తీసుకునే సమయంలో.. వాహనం వెనక్కి ఒరిగి లోయలో పడిపోవడంతో ఈ ఘోరం జరిగినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Around 10 Army personnel feared dead in a horrific Road mishap today in Sikkim. Accident spot is at Zeema village, Lachen, North Sikkim. My thoughts and prayers with the victims families. 😢🙏🏻@adgpi @rajnathsingh @PMOIndia @narendramodi pic.twitter.com/lkwhw5VAA6
— Licypriya Kangujam (@LicypriyaK) December 23, 2022
ఈ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరజవాన్లు అందించిన సేవలు, నిబద్ధతను దేశ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులైన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ దురదృష్టకర ఘటనలో అమరులైన జవాన్లకు కామెంట్ల రూపంలో సంతాపాన్ని తెలియజేయండి.
Deeply pained by the loss of lives of the Indian Army personnel due to a road accident in North Sikkim.
The nation is deeply grateful for their service and commitment. My condolences to the bereaved families. Praying for the speedy recovery of those who are injured.
— Rajnath Singh (@rajnathsingh) December 23, 2022