Cat : పిల్లి, పత్తి కథ విన్న వారికి దాని వల్ల కలిగే నష్టం ఏంటో తెలిసే ఉంటుంది. అది ఒక ఇంట్లో పత్తి కాబట్టి పెంచుకున్న వాడు నష్టపోతాడు. కానీ, ఈ కథలో అలా జరగలేదు. పిల్లి చేసిన పనికి వేల సంఖ్యలో చిరు వ్యాపారులు నష్టపోయారు. కోటో రెండు కోట్లో కాదు.. ఏకంగా వంద కోట్లు. వంద కోట్లా.. అంత పని ఏమి చేసింది? అని అనుకుంటున్నారా? తెలుసుకోవాలనుకుంటే మొత్తం చదివేసేయండి. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, పుణెలోని ఓ పిల్లి ట్రాన్స్ఫార్మర్ మీదకు ఎక్కింది. దీంతో షార్ట్ సర్కూ్యట్ అయింది. భోసారి, భోసారి ఎంఐడీసీ, అకుర్ధి ప్రాంతాల్లోని 60 వేల మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
దీంతో గృహాలతోపాటు కుటీర పరిశ్రమల పనులకు ఆటంకం కలిగింది. దాదాపు ఏడు వేలమంది వ్యాపారులు పనులకు ఆటంకం ఏర్పడి భారీగా నష్టపోయారు. ఈ విలువ వంద కోట్ల రూపాయల దాకా ఉండొచ్చని అంచనా.. మరో మూడు రోజుల పాటు విద్యుత్ పునరుద్ధరణ జరిగే అవకాశం కనిపించటం లేదు. కుటీర పరిశ్రమల సంఘం అధ్యక్షుడు వెంటనే విద్యుత్ను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : 100 కోట్ల లగ్జరీ హెలికాప్టర్ కొన్న మొదటి భారతీయుడు.. దీని స్పెషాలిటీ ఏంటి?
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.