దేశంలో గత కొంత కాలంగా నేరాలు ఘోరాలు బాగానే పెరిగిపోయాయి. కరోనా సమయంలో కూడా కొంత మంది నేరగాళ్లు రెచ్చిపోయారు. ఇక ఇంటి పెద్దను కోల్పోయి.. సమాజంలో ఆదరణ కరువై.. కుటుంబాలు దుర్భరమైన జీవితాలను వెల్లదీస్తున్నాయి. తండ్రి లేని పిల్లల బాధ గురించి ఎంత చెప్పినా తక్కువే.
అస్సాంలోని సిల్చార్కు చెందిన నాలుగేళ్ల రిజ్వాన్ సాహిద్ లస్కర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ నేపథ్యంలో నాకు న్యాయం కావాలని ప్రధాని మోడీని కోరుతూ.. అసోంకు చెందిన నాలుగేళ్ల బాలుడు చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రిజ్వాన్ మూడు నెలల వయసులో ఉన్నప్పుడే (2016, డిసెంబర్ 26న) అతడి నాన్న (సహిదుల్) ను కొందరు దుండగులు చంపేశారు. ఆ కేసు విషయంలో ఇప్పటికీ ముందుకు సాగలేదు. ఆ నాటి నిందితు పోలీసులు పట్టుకోలేకపోయారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మినిస్టర్ అమిత్షా, రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్లను ప్రస్తావిస్తూ.. విజ్ఞప్తి చేశాడు. ‘తన పేరు రిజ్వాన్ సాహిద్ అని, 2016 డిసెంబర్ 26న సిల్చార్లోని సోనాయ్ రోడ్లో తన తండ్రిని చంపేశారని వివరించాడు. ఐ వాంట్ జస్టిస్ అనే వాక్యంతో కూడి ప్లకార్డును పట్టుకుని.. తన సమస్యను వివరించాడు. హంతకులను పట్టుకుని తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరాడు. ప్రస్తుతం ఈ బాలుడు చేసిన విజ్ఞప్తికి చెందిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
I want justice.@PMOIndia @HMOIndia @himantabiswa @cacharpolice @TheQuint pic.twitter.com/Cm0DeVw8TD
— Rizwan Sahid Laskar (@sahid_rizwan) September 13, 2021