జరిమాన అనేది ఏదైన తప్పు చేస్తే విధించే శిక్షలో ఓ భాగం. అయితే కొన్ని సార్లు ఈ జరిమానాలు సామాన్యులను షాక్ కి గురి చేస్తాయి. అయితే ఈ జరిమానాలు అనేది దేశానికో తీరుగా ఉంటాయి. ఆయా దేశాలు తమ పరిస్థితులను బట్టి.. పలు రకాల పనుల జరిమానాలు విధిస్తుంటారు. అయితే కొన్ని దేశాలు విధించే జరిమానాలు విచిత్రంగా ఉంటాయి. నలుగురిలో తుమ్మినందుకు, ఎక్కువ స్పీడ్ తో పరిగెత్తినందుకు జరిమానాలు విధిస్తుంటారు. తాజాగా ఓ ఇంటికి గులాబీ రంగు వేసినందుకు ఆ ఇంటి యజమానికి రూ.19 లక్షల భారీ జరిమాన విధించారు. దీంతో సదరు ఇంటి యజమానురాలు ఆశ్చర్యానికి గురైంది. ఈ ఘటన స్కాట్లాండ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
స్కాట్లాండ్ లో కూడా మిగిలిన దేశాల్లో మాదిరి ఇల్లు కట్టేటప్పుడు అనుమతులు తీసుకోవడం తప్పని సరి. అయితే ఇంటి నిర్మాణ అనంతరం రంగులు వెయ్యడానికి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పౌరుడు ఇంటి ముందు ఉండే ప్రధాన ద్వారానికి తమకు నచ్చిన రంగు వేసుకుంటానంటే కుదరదు. అలా వేసే వారికి జరిమాన విధిస్తున్నారు. కొన్ని సార్లు కళ్లు బైర్లు కమ్మే జరిమానాలు సైతం విధిస్తుంటుంది ఇక్కడి ప్రభుత్వం. అందుకు ఎడిన్ బర్గ్ ప్రాంతానకి చెందిన మిరండా డిక్సన్ అనే మహిళ విధించిన జరిమానే ఉదాహరణ. ఆమె తన ఇంటికి ఇటీవలే మరమ్మతులు చేయించింది. ఈ పనులు పూరైన అనంతరం రంగు కూడా వేయించింది. అయితే తన ఇంటి తలుపుకు గూలాబీ రంగును వేయించింది మిరండా డిక్సాన్. అయితే దీనిపై ఎడిన్ బర్గ్ సిటీ కౌన్సిల్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
కౌన్సిల్ తెలిపిన ప్రకారం..తెలుపు రంగు మాత్రమే వేయాలని ఆదేశించారు. అయితే తలుపు గులాబీ రంగు వేయడంతో తన ఇంటికే చాలా అందం వచ్చిందని డక్సన్ తెలిపారు. అదే విధంగా వీధిలో వెళ్లే వాళ్లను తన ఇళ్లు ఎంతగానో ఆకర్షిస్తోందని, అంతేకాక తన ఇంటి గేటు వద్దకు వచ్చి సెల్ఫీ తీసుకొని మరీ వెళ్తున్నారని ఆమె వివరించింది. తెలుపు రంగు అంటే తనకు ఇష్టం లేదని ఆమె అధికారులకు తేల్చి చెప్పింది. దీంతో కౌన్సిల్ రూల్స్ ను అతిక్రమించినందుకు ఆమెకు అధికారులు 20 వేల పౌండ్ల జరిమాన విధించారు. మన కరెన్సీలో సుమారు రూ.19 లక్షలు. కౌన్సిల్ ఆదేశాలను ధిక్కరించి ఇంటి తలుపులకు గులాబీ రంగు వేసినందుకు ఈ మొత్తం చెల్లించాలని ఆదేశించారు. అధికారులు వేసిన జరిమానాను సదరు మహిళ కట్టినట్లు సమాచారం.