ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఘని ఇల్లు పొడిచి పారిపోయాడు. వెళ్ళేటప్పుడు ఘని డబ్బు కట్టలతో సహా పారిపోయినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే తాను డబ్బుతో పారిపోలేదని కేవలం కట్టుబట్టలతో వెళ్లానని ఘని తెలిపారు. మళ్లీ దేశానికి వస్తానని చెప్పారు. ఇక ఆ దేశ అధ్యక్షుడు పారిపోవడంతో తాళిబన్ల నుండి రక్షిస్తానని ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా అమ్రుల్లా సాలెహ్ ప్రకటించుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్కు తానే అధ్యక్షుడినని ఆ దేశ మొదటి ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలెహ్ ప్రకటించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఆఫ్ఘనిస్థాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు పారిపోవడం, చనిపోవడం లేదా రాజీనామా చేస్తే ఉపాధ్యక్షుడు ఆపద్ధర్మ అధ్యక్షుడు అవుతారని తెలిపారు. ప్రస్తుతం తాను దేశంలోనే ఉన్నానని కాబట్టి తానే ఆపద్ధర్మ అధ్యక్షుడినని తెలిపారు. ఈ విషయంలో అందరి మద్దతు పొందేందుకు తాను ప్రయత్నిస్తున్నానని అన్నారు. ఆయనకు పలు దేశాలు మద్దతు కూడా ప్రకటించాయి.
అయితే ఆయనకు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. అమ్రుల్లా ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో ఈ అంశం సంచలనంగా మారింది. దీనిపై స్పందించి నిబంధనలకు లోబడే అమ్రుల్లా అకౌంట్ ను తొలగించామని ట్విట్టర్ వెల్లడించింది.