సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ద్వారా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతిఒక్కరు వారి భావాలను వ్యక్తపరుచుకునే ఒక వేదిక. వారు అనుకున్న విషయాలను నెటిజన్లతో పంచుకోవచ్చు. అయితే యూజర్లు పోస్టు చేసే ట్వీట్లను ఎడిట్ చేసుకునేందుకు అధ్బుతమైన ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
టెస్లా, ట్విట్టర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తరువాత విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు.. సంస్థపై భారాన్ని తగ్గించేందుకు ట్విట్టర్ లో పనిచేసే ఉద్యోగులను తొలగించి షాక్ ఇచ్చాడు ఎలాన్ మస్క్. ట్విట్టర్ సిఇఒ పదవి నుంచి వైదొలగిన మస్క్ ఆ స్థానంలో కొత్త సిఇఒను నియమించారు. అయితే తాజాగా ట్విట్టర్ లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. యూజర్లు ట్వీట్ చేసే ట్వీట్లను ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది ట్విట్టర్.
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ కంపెనీ సిఇఒగా లిండా యాకారినోను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొత్త సిఇఒ వచ్చిరాగానే యూజర్లకు ట్వీట్ లను ఎడిట్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. యూజర్లు ట్వీట్ చేసిన గంట వ్యవధిలో ట్వీట్ ను ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. కాగా ఈ విధమైన ట్విట్టర్ ఎడిట్ ఆప్షన్ ను గతేడాది అక్టోబర్ లోనే ప్రవేశపెట్టింది. ఇది అమల్లోకి వచ్చిన రోజుల్లో ట్విట్టర్ యూజర్లు వారి పోస్టులను పోస్టు చేసిన 30నిమిషాల్లో మార్పులు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. యూజర్లకు మరింత చేరువయ్యేందుకు పోస్టును ఎడిట్ చేసుకునే సమయాన్ని గంటకు పొడిగించింది ట్విట్టర్ సంస్థ.
దీనికి సంబంధించిన విషయాన్ని ట్విట్టర్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ ఎడిట్ ఆప్షన్ అనేది కేవలం బ్లూటిక్ కలిగిన యూజర్లు మాత్రమే వినియోగించుకునేలా రూపొందించింది. ఆండ్రాయిడ్, ఐఒఎస్ మొబైల్ వినియోగదారులు రెండింటిలో ఎడిట్ ఆప్షన్ ను వినియోగించుకోవచ్చు. ఈ స్పెషల్ ఫీచర్ ద్వారా ట్వీట్లను సవరించడం, కావాల్సిన రీతిలో మెరుగులు దిద్దడం చేయవచ్చు. అయితే ఈ ఫీచర్ ను బ్లూ టిక్ సబ్ స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంచడానికి కారణం ఎక్కువ మంది బ్లూటిక్ ప్రీమియం సేవను ఎంచుకునే అవకాశం ఉందని ట్విట్టర్ సంస్థ వ్యూహాత్మకంగా ఆలోచించి ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.