అమెరికాలో ఎమ్మెస్ చదువుతున్న తెలుగు విద్యార్థులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికా వీధుల్లో చొక్కాలు చింపుకుని మరీ కొట్టుకున్నారు.
కొంతమంది తెలుగు విద్యార్థులు వీధుల్లో బహిరంగ ఘర్షణకు దిగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి అనేక రూమర్లు వస్తున్నాయి. అమెరికాలో జరిగిన ఓ ఈవెంట్ లో తెలుగు విద్యార్థులు ఘర్షణకు దిగారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. రెండు రాజకీయ పార్టీలకు చెందిన విద్యార్థుల మధ్య గొడవ జరిగిందని వార్తలు ప్రచారం చేస్తున్నారు. రీసెంట్ గా నాటా సమావేశం జరిగింది. అయితే ఈ గొడవను డల్లాస్ లో ఈవెంట్ సమయంలో జరిగిన గొడవగా ప్రచారం చేస్తున్నారు. రెండు రాజకీయ పార్టీలు, కులాల మధ్య జరిగిన గొడవగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ, బాలయ్య మద్దతుదారులకు, ఇతర కులస్తులకు మధ్య తలెత్తిన ఘర్షణలో గొడవపడ్డారంటూ ప్రచారం చేస్తున్నారు.
అయితే ఈ స్ట్రీట్ ఫైట్ చికాగోలోని నేపర్ విల్లేలో జామర్స్ లైవ్ బ్యాండ్ ప్రదర్శన తర్వాత జరిగినట్లు సమాచారం. ఆర్గనైజర్లకు, ఎమ్మెస్ విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని.. దీంతో ఒకరిపై ఒకరు కలబడ్డారని తెలుస్తోంది. అయితే ఈ ఘర్షణలో ఎవరిది తప్పు అనేది తెలియదు. అయితే తెలుగు వాళ్ళు ఇలా వీధి రౌడీల్లా చొక్కాలు చింపుకొని గొడవ పడడం పట్ల తెలుగు వాళ్ళ పరువు పోతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా యూఎస్ లో ఇక్కడ నుంచి వెళ్లి స్థిరపడిన తెలుగు వాళ్ళ పరువు పోతుందన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.